కావూరి ర్యాలీలో అపశ్రుతి: బాణసంచా పేలి ఒకరి మృతి

ఈ సమయంలో ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. బాణ సంచా పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. భారీగా వచ్చిన అభిమానులు ర్యాలీగా వెళ్తుండగా.. బాణసంచాతో మరో ఆటో వెళ్తోంది. ఈ సమయంలో బాణసంచా పేలి నిప్పు రవ్వలు ఆటోలో పడ్డాయి. దీంతో ఒకరు మృతి చెందారు. గాయపడ్డ వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.
అడ్డుకున్న టిడిపి
గన్నవరం నుండి ఏలూరుకు వెళ్తున్న కావూరి కాన్వాయ్ను తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డుకున్నారు. తెలంగాణ అంశంపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో సీమాంధ్ర టిడిపి నేతలు ఆయనను హనుమాన్ జంక్షన్ వద్ద అఢ్డుకున్నారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
కాగా కావూరి ఈ రోజు తొలుత హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుండి ర్యాలీగా ఏలూరుకు బయలుదేరారు. ఆయనకు విమానాశ్రయంలో కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.












Click it and Unblock the Notifications