తెలంగాణకు జైకొట్టిన దిగ్విజయ్, మరింత స్పష్టత

ఆంధ్ర ప్రదేశ్లో తెలంగాణ సమస్య ఉందని, తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆ రాష్ట్రంలో తమ విజయావకాశాలు పెరుగుతాయని వ్యాఖ్యానించారు. తమ దృష్టి అంతా దక్షిణాది రాష్ట్రాల పైనే ఉందని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో యాభై సీట్లు గెలువాలనేది తమ లక్ష్యమని ఆయన చెప్పారు. కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్ల పైననే తమ దృష్టి ఉందని చెప్పారు. తమ ఆశలు కూడా దక్షిణాది పైనే ఉన్నాయన్నారు. కర్నాటక లోకసభ ఎన్నికలలో ఎక్కువ సీట్లు గెలుస్తామనే ఆశాభావం వ్యక్తం చేశారు. కేరళలోను తమకు అనుకూలంగా ఉందన్నారు. తమిళనాడులో పొత్తులకు ఇంకా సమయం ఉందని చెప్పారు.
తెలంగాణ విషయంలో రెండే ప్రత్యామ్నాయాలు ఉన్నాయని చెప్పానని, ఒకటి విభజన, రెండు సమైక్యాంధ్ర అన్నారు. రోడ్డు మ్యాప్తో రావాలని రాష్ట్ర ముఖ్యనేతలకు చెప్పానని, ఆ నివేదికను అధిష్టానానికి ఇస్తామని చెప్పారు.
అధిష్టానం చేతుల్లో: శైలజానాథ్
తెలంగాణ అంశం అధిష్టానం చేతులలో ఉందని మంత్రి శైలజానాథ్ అనంతపురం జిల్లాలో అన్నారు. అనుకోని నిర్ణయం వస్తే అనంతపురం ఏడారి అవుతుందన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు శాయశక్తులా కృషి చేస్తామన్నారు.
కాగా రాష్ట్రం విడిపోతే ఎవరికీ నష్టం లేదని మంత్రి జానా రెడ్డి హైదరాబాదులో అన్నారు. విడిపోతే ఎవరికీ అవమానం జరగదన్నారు. తెలంగాణ సమస్య ఎన్నో ఏళ్లుగా పెండింగులో ఉందన్నారు. అధిష్టానం తెలంగాణ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications