నింగికెగసిన దిక్సూచి: పిఎస్ఎల్వీ సి22 విజయవంతం

Indian PSLV successfully launches IRNSS-1A navigation satellite
నెల్లూరు: విపత్తులకు, విమానాలకు ఎంతో ఉపయోగపడే ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. దీనిని సోమవారం అర్ధరాత్రి ప్రయోగించారు. రాత్రి 11.41 నిమిషాలకు ఇది నింగిలోకి దూసుకెళ్లింది. ఇది తొలి భారత ప్రాంతీయ దిక్సూచీ ఉపగ్రహం. దీనిని రోదసీలోకి పంపించడం ద్వారా అభివృద్ధి చెందిన దేశాల సరసన మన దేశం చేరింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌లో అంతరిక్ష పరిశోధకులు అవిశ్రాంతంగా పనిచేసి చోదక వ్యవస్థకు మార్గదర్శిగా ఉపయోగపడే స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ ఈ తొలి ఉపగ్రహాన్ని (ఐఆర్ఎన్ఎస్ఎస్ -1ఏ) విజయవంతంగా ప్రయోగించారు. పిఎస్ఎల్వీ సి22 రాకెట్ ఈ ఉపగ్రహాన్ని మోసుకుంటూ నింగిలోకి దూసుకువెళ్లింది.

శాస్త్రవేత్తల అంచనాలకు అనుగుణంగా ఉప భూస్థిర కక్ష్యలోకి దాన్ని ప్రవేశపెట్టింది. దీంతో మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రయోగాన్ని నిర్వహిస్తున్న ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్‌సహా శాస్త్రవేత్తల వదనాల్లో ఆత్మవిశ్వాసంతో కూడిన దరహాసం చోటుచేసుకుంది. అందరిలోనూ ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.

ఇంతలో కర్ణాటకలోని ఇస్రోకు చెందిన హసన్ కేంద్రానికి ఉపగ్రహ సంకేతాలు కూడా అందడం.. ఆ విషయం మిషన్ కంట్రోల్ సెంటర్‌కు చేరడంతో శాస్త్రవేత్తలు కరతాళ ధ్వనులు చేశారు. దేశంలో తొలి నావిగేషన్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైందని ప్రకటించారు. మిషన్ డైరెక్టర్ డాక్టర్ సురేష్‌తోపాటు ఈ ప్రయోగంలో కీలకపాత్ర పోషించిన శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ అభినందించారు. 44 మీటర్ల ఎత్తున్న ఈ ఉపగ్రహం పదేళ్లపాటు పని చేస్తుంది. ఉపగ్రహం బరువు 1,425 కిలోలు. ప్రయోగానికి అయిన ఖర్చు రూ.1,600 కోట్లు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+