కిరాయికి రేపిస్టులు: పశ్చిమ బెంగాల్ మంత్రి వ్యాఖ్య
మూడు రాజకీయ పార్టీల వద్ద విపరీతంగా డబ్బులున్నాయని, మమతా బెనర్జీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డు తగలడానికి రేపిస్టులకు డబ్బులు చెల్లించి వారిని వాడుకుంటున్నాయని మహాపాత్ర అన్నారు. వెస్ట్ మిడ్నాపూర్ కేశియారీలో జరిగిన బహిరంగ సభలో ఆయన ఆ వ్యాఖ్యలు చేసారు. కాముదిని అత్యాచారం - హత్య కేసులోని ప్రధాన నిందితుడు అన్సార్ అలీ సిపిఎం మద్దతుదారుడని ఆయన ఆరోపించారు.
మహాపాత్ర వ్యాఖ్యలపై ప్రతిపక్షాల నాయకులు ధ్వజమెత్తారు. మంత్రిలో ఆలోచనా శక్తి నశించినట్లుందని రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుడు ప్రదీప్ భట్టాచార్య అన్నారు. రాష్ట్రంలో బుద్ధిలేని ప్రభుత్వ పాలన సాగుతోందని, ఒక్క మంత్రి అటువంటి వ్యాఖ్యలు చేయడమేమిటని అన్నారు.
ప్రతిపక్షాలు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, తాను బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తానంటూ రేపిస్టులు తమ తప్పులను కొనసాగించవచ్చునని ముఖ్యమంత్రి స్వయంగా చెబుతున్నారని బిజెపి అధ్యక్షుడు రాహుల్ సిన్హా అన్నారు. మంత్రి వ్యాఖ్యలను సిపిఎ నాయకుడు ఎండి సలీం తప్పు పట్టారు.