జగన్ అరెస్ట్: పనబాకపై బాంబు పేల్చిన మోపిదేవి బ్రదర్

ఈ సమయంలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు అరెస్టైన సమయంలో పనబాకను కలిస్తే జగన్కు వ్యతిరేకంగా కోవర్టుగా మారితే బయటకు తీసుకు వస్తామని ఆమె చెప్పారని ఆరోపించారు. జైలులో ఆయన ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవడం లేదన్నారు. వైద్య సాయం కోసం మంత్రి కొండ్రు మురళిని కలిసి బతిమాలినా వినిపించుకోలేదని ఆయన ఆరోపించారు.
వైయస్ అధికారంలోకి తెస్తే ఎఫ్ఐఆర్లో పెట్టారు: విజయమ్మ
26 జివోల కేసు రాజకీయ ప్రేరేపిత కుట్ర అని వైయస్ విజయమ్మ అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కష్టపడి కాంగ్రెసు పార్టీని అధికారంలోకి తీసుకు వస్తే, జగన్ కేసులో ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 26 జివోల విషయంలో ఒక్కొక్కరి పట్ల ఒక్కోరకంగా వ్యవహరిస్తున్నారన్నారు.
వైయస్ పైన, జగన్ పైన అభిమానంతో పార్టీలో చేరుతున్న వారికి కృతజ్ఞతలు చెప్పారు. జగన్ని అరెస్టు చేసేందుకు మోపిదేవిని బలి చేశారన్నారు. మోపిదేవిని అరెస్టు చేసే సయంలో వారం రోజుల్లో బయటకు తీసుకు వస్తామని చెప్పి తీసుకు రాలేదని ఆరోపించారు. కాంగ్రెసు, టిడిపి కుమ్మక్కయ్యాయని, వారి పాపం పండే రోజు వస్తుందన్నారు.












Click it and Unblock the Notifications