కిరణ్, బొత్స తెలంగాణకే ఓటేస్తారు: శ్రీధర్ బాబు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అధిష్టానం సానుకూలంగా ఉందని ఆయన అన్నారు. కాబట్టి, ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు కూడా అందుకు అనుగుణంగానే నివేదిక ఇస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని కాంగ్రెస్లో విలీనం చేయాలనే షరతు ఏమైనా ఉందా అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ - దీనిపై చర్చ అనవసరమని అన్నారు. తమకు తెలంగాణ సాధనే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
విదేశీయులకు సంబంధించి సౌదీ అరేబియా ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం అమలును మరో నాలుగు నెలలపాటు వాయిదా వేసిందని ఆయన చెప్పారు. దీనివల్ల సౌదీలో ఉన్న 11,700 మంది తెలుగువారికి కొంత వెసులుబాటు వచ్చిందన్నారు.
నాలుగు నెలల్లో వారందరిని ఇక్కడకు తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తామని ఆయన అన్నారు. చార్ధామ్ యాత్రకి వెళ్లిన తెలుగువారిలో ఇప్పటికీ 81 మంది ఆచూకీ తెలియలేదని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు.
తెలంగాణపై కోర్ కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మంత్రి దానం నాగేందర్ చెప్పారు. గురువారం ఉదయం కుటుంబ సమేతంగా దానం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల సంక్షేమం కోసమే అని ఎన్నికల కోసం కాదని దానం తెలిపారు.