భోగాలన్నీ తాత్కాలికమే: చంద్రబాబు వేదాంతం
తమ పార్టీ కార్యకర్తలకు నీతి, నిజాయితీలు ఉన్నాయని, పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్న కార్యకర్తలు ఉన్నారని అన్నారు. శనివారం ఉదయం నగరంలో జరిగిన పార్టీ ప్రాంతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. అధికారం కోసం కొందరు నేతలు తమ పార్టీని వీడారని, ఒక్క కార్యకర్త కూడా పార్టీని వీడలేదని ప్రసంసించారు.
మహానాడును మించి కొంపల్లి ప్రాంతీయ సదస్సు జరిగిందన్నారు. తెలుగుదేశం కుటుంబసభ్యులు తన ప్రాణసమానులన్నారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని మండిపడ్డారు. కార్యక్రమం ప్రారంభం ముందు ఉత్తరాఖండ్ వరదబాధితులను పార్టీ సంతాపం ప్రకటించింది.
వరద బాధితులకు రూ.10 లక్షల ఆర్థికసాయం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం దూరదృష్టితో వ్యవహరించలేదని, ప్రభుత్వం చేయలేని పని తమ పార్టీ చేసిందని చంద్రబాబు చెప్పుకున్నారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయడమే తమ పార్టీ లక్ష్యమని ఆయన అన్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామసభల ద్వారా అధికారులే ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరించే కృషి చేసిందని చెప్పారు.