వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెళ్లి పేరుతో 11 మంది స్త్రీలను మోసం చేసిన ఘరానా

By Pratap
|
Google Oneindia TeluguNews

wedding proposals
హైదరాబాద్: నిత్య పెళ్లికొడుకు వెంకట్రావును శనివారం ఉదయం ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. పెళ్లి పేరుతో 11 మంది యువతులను మోసం చేసిన కొండేపికి చెందిన వెంకట్రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ.11 లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఇదిలా వుంటే, వరంగల్ జిల్లాలోని కేఎంసీలో ర్యాగింగ్ ఉదంతం కలవరానికి గురి చేసింది. ఓ జూనియర్ విద్యార్థిని సీనియర్లు చితకబాదినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటన బయటకు పొక్కకుండా కాలేజీ యాజమాన్యం యత్నిస్తోంది. తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

భార్య కాళ్లూ చేతులూ నరికాడు

శ్రీకాకుళం జిల్లాలోని గార మండలం బందరువానిపాలెంలో ఓ వ్యక్తి అత్యంత దారుణానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాలతో ఓ భర్త కట్టుకున్న భార్య కాళ్లు, చేతులు నరికేశాడు. భార్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

నల్గొండ జిల్లాలోని కోదాడ బైపాస్ రోడ్డులో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కారు- ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

నెల్లూరు జిల్లాలోని ఎస్పీ కార్యాలయం దగ్గర పోలీస్ వ్యాన్‌ను కొందరు గుర్తుతెలియని దుండగులు దహనం చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

English summary
A person has been arrested for cheating 11 girls on the name of marraige in Prakasham district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X