సంప్రదింపులుండవు, నిర్ణయమే: తెలంగాణపై దిగ్విజయ్

ఇదిలావుంటే, వర్కింగ్ కమిటీలో కూడా తెలంగాణ అంశం తేలే అవకాశం లేదని రాష్ట్రానికి చెందిన సిడబ్ల్యుసి సభ్యుడు సంజీవ రెడ్డి చెప్పారు. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని తాను చెబుతానని ఆయన ఓ ప్రముఖ తెలుగు టీవి చానెల్ ప్రతినిధితో అన్నారు. వర్కింగ్ కమిటీ సమావేశం కూడా నిర్ణయాన్ని పార్టీ అధిష్టానానికే వదిలేసే అవకాశాలున్నాయని ఆయన అన్నారు.
అభివృద్ధికి కావాల్సింది డబ్బే కదా, అది ప్యాకేజీ రూపంలో ఇస్తే సరిపోతుందని ఆయన అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే మంచిదని అన్నారు. ఇరు ప్రాంతాలవారు ఓ రాజీ మార్గానికి వస్తే మంచిదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని, తాము మాత్రం సమైక్యవాదినేనని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వర్కింగ్ కమిటీలోని ఇతర రాష్ట్రాల సభ్యులు అంగీకరించకపోవచ్చునని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనతో దేశంలోని ఇతర ప్రాంతాల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అన్నారు. వర్కింగ్ కమిటీ సమావేశంలో తెలంగాణపై విస్తృత చర్చ జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ఇస్తే సీమాంధ్రలో పార్టీకి నష్టం జరుగుతుందని, ఇవ్వకపోతే తెలంగాణలో నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. అయినా, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే మంచిదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications