జగన్ పార్టీలోకి వెళ్లేవారే వ్యతిరేకిస్తున్నారు: టీపై పొన్నం

Ponnam Prabhakar
న్యూఢిల్లీ: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లేవాళ్లే తెలంగాణను వ్యతిరేకిస్తున్నారని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఉద్యమాలు సృష్టిస్తే జగన్‌కే లాభమని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ ఇవ్వడానికే తదుపరి కీలక సమావేశాలు జరుగుతాయని ఆయన అన్నారు.

తెలంగాణకు వ్యతిరేకమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కోర్ కమిటీ సమావేశంలో చెప్పినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పడం సంతోషమని ఆయన అన్నారు. తెలంగాణపై సిడబ్ల్యుసి సభ్యుడు సంజీవ రెడ్డి ఏం చెబుతారో చూడాల్సి ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ఇస్తే నక్సలైట్లు పెరుగుతారని చెప్పడం కాంగ్రెసు పార్టీకి ద్రోహం చేయడమేనని ఆయన అన్నారు.

వైయస్ జగన్ అవినీతిని తెలంగాణను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర నాయకులు ఎందుకు ఎండగట్టలేకపోయారని ఆయన అడిగారు. యాభై ఏళ్ల నుంచి తాము బాధపడుతున్నామని, ఆత్మహత్యలు జరుగుతున్నాయని, అయినా తెలంగాణను అడ్డుకోవాలని చూడడం సరి కాదని ఆయన అన్నారు.

వారేమిటో బయటపడ్డారు

రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స వైఖరి బయటపడిందని బిజెపి నేత బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజీనామాలు చేస్తామని హైకమాండ్‌కు చెప్పి తెలంగాణపై నిర్ణయాన్ని ఆలస్యం చేశారని మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణపై బిల్లు పెట్టే వరకు కాంగ్రెస్‌ను తెలంగాణ ప్రజలు నమ్మరని దత్తాత్రేయ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+