తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్మైల్ ప్లీజ్!: శ్రీవారి సేవలో కేంద్రమంత్రి వాసన్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: కేంద్రమంత్రి జికె వాసన్ మంగళవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వాసన్, ఆయన కుటుంబ సభ్యులు మధ్యాహ్నం శ్రీవారిని దర్శించుకున్నారు. వాసన్‌కు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కనుమూరి బాపిరాజు, శ్రీనివాస రాజులు స్వాగతం పలికారు.

రంగనాయకుల మండపం వద్ద వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. తితిదే చైర్మన్, తిరుమల జెఈవోలు ఆయనకు శ్రీవారి ప్రసాదం ఇచ్చారు. స్థానిక పార్లమెంటు సభ్యులు చింతామోహన్, పరకామణి డిప్యూటీ ఈవో రామారావు తదితరులు కేంద్రమంత్రి వెంట ఉన్నారు.

నిబంధలకు విరుద్ధంగా..

శ్రీవారి దర్శనానికి వచ్చిన వాసన్‌కు ఎంపీ అనుచరులు పూలమాలలతో స్వాగతం పలికి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. మంత్రికి స్వాగతం పలికేందుకు ఎంపీలు మాత్రమే అర్హులని, టోల్ గేట్ సుబ్బంది బాధ్యతారాహిత్యంపై చర్యలు తీసుకోవాలని ఈవోకు సిబ్బంది ఫిర్యాదు చేశారు.

వాసన్‌కు స్వాగతం

కేంద్రమంత్రి జకె వాసన్‌కు స్వాగతం పలుకుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కనుమూరి బాపిరాజు, శ్రీనివాస రాజు

శ్రీవారి చెంత

కుటుంబ సభ్యులతో శ్రీవారి చెంత కేంద్రమంత్రి. మంగళవారం మధ్యాహ్నం ఆయన వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు.

ప్రసాదం అందజేత

కేంద్రమంత్రి వాసన్‌కు శ్రీవారి ప్రసాదం అందజేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు.

స్మైల్ ప్లీజ్!

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో వాసన్ కుటుంబ సభ్యులు

అధికారులతో..

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల, స్థానిక పార్లమెంటు సభ్యులతో వాసన్ కుటుంబ సభ్యులు

English summary
Hon'ble Union Minister for Shipping Sri G.K.Vasan along with his family members took blessings of Lord Venkateswara of Tirumala on Tuesday afternoon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X