విజయమ్మ ఫీజు దీక్ష, చంద్రబాబును క్రాస్ చేసిన షర్మిల
ఈ దీక్షకు భారీగా విద్యార్థులు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్స్ ప్రవేశ పెడితే, కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు దానిని తుంగలో తొక్కిందని భూమన ఆరోపించారు.
షర్మిల యాత్ర రికార్డ్
తమ పార్టీ నేత షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర మరో మైలు రాయికి చేరుకుందని భూమన అన్నారు. షర్మిల 2,800 కిలోమీటర్ల యాత్రను పూర్తి చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అవార్డుల కోసమే, రివార్డుల కోసమే యాత్ర చేస్తే షర్మిల మాత్రం ప్రజల మనసులను గెలుచుకునేందుకు చేశారన్నారు.
ఆగస్టు మొదటి వారంలో షర్మిల యాత్ర మూడువేల కిలోమీటర్లు దాటుతుందన్నారు. ఈ పాదయాత్ర ప్రపంచ రాజకీయ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిపోనుందన్నారు. రెండున్నర కోట్ల మంది హృదయాలను తాకుదూ పాదయాత్ర లక్ష్యం దిశగా దూసుకుపోతోందన్నారు. కాగా గతంలో చంద్రబాబు వస్తున్నా మీకోసం పేరుతో 2,800 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఇప్పుడు షర్మిల దానిని దాటారు.