తెలంగాణపై సంప్రదింపులు పూర్తయ్యాయి: దిగ్విజయ్
అదే సమయంలో తెలంగాణ అంశంపై స్పందించారు. తెలంగాణపై సంప్రదింపులు పూర్తయ్యాయని, యూపిఏ ప్రభుత్వం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. తెలంగాణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే గురువారం చెప్పిన విషయం తెలిసిందే. తెలంగాణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని అయితే, అది పార్లమెంటు సమావేశాలకు ముందా లేక తర్వాతనా అన్న విషయం మాత్రం తెలియదన్నారు.
సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నట్లు చెప్పారు. త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పిన షిండే.. ఆ నిర్ణయం కాంగ్రెసు పార్టీదా, యూపిఏ నిర్ణయమా లేక ప్రభుత్వానిదా అని కూడా వెల్లడించలేదు. అయితే ఈ రోజు దిగ్విజయ్ మాత్రం యూపిఏ ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
హాట్ హాట్గా కేబినెట్ సమావేశం?
కాగా ఈ రోజు ఎపి కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశానికి పలువురు మంత్రులు హాజరయ్యారు. ఇటీవల కోర్ కమిటీ భేటీకి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్రకు అనుకూలంగా రోడ్ మ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రులు సిఎంను ప్రశ్నించే అవకాశాలు లేకపోలేదు. దీంతో కేబినెట్ సమావేశం హాట్ హాట్గా మారే అవకాశముందా? అనే చర్చ సాగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.