హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వివాహం సమస్య: స్మశానంలో శవమై తేలిన టెక్కీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Techie's body found at graveyard
హైదరాబాద్: ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హైదరాబాదులోని రాయదుర్గం స్మశానవాటికలో శవమై కనిపించాడు. అతను మంగళవారం నుంచి కనిపించుకుండా పోయాడు. అతను విషం సేవించి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. వంశీకృష్ణ అనే సిఎఎస్ఇ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఖమ్మం జిల్లాకు చెందినవాడు.

వంశీకృష్ణ హైదరాబాదులోని నానక్‌రాంగుడాలో ఉంటున్నాడు. వివాహ సంబంధమైన సమస్యలతో అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. అతను మంజరి అనే అమ్మాయిని నిరుడు మేలో పెళ్లి చేసుకున్నాడు.

వంశీ మంగళవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతను కనిపించడం లేదని కుటుంబ సభ్యులు బుధవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. ఆ సాయంత్రమే అతని శవం కనిపించింది.

ఇదిలావుండగా, మాచరేవులలో ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఇద్దరు బిటెక్ విద్యార్థులు గురువారం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కెజి రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన మోనిక, రఫీక్ అనే ఇద్దరు ప్రేమికులు పెద్దల వ్యతిరేకతతో ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే.

English summary

 A software engineer, who went missing on Tuesday, was found dead at a graveyard at Raidurgam on Wednesday evening. Police said he might have committed suicide by consuming poison.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X