ఇంటి వద్ద భర్త శవం: ఓటేయడానికి వచ్చిన భార్య

కిటుముల పంచాయతీలోని భీమనాపల్లి గ్రామానికి చెందిన కొర్ర నర్సింహారావు అనే 40 ఏళ్ల వ్యక్తి మంగళవారం తెల్లవారుజామున అనారోగ్యంతో మరణించాడు. గ్రామంలోని అందరూ పోలింగుకు బయలుదేరి వెళ్లారు. నర్సింహారావు భార్య కొర్రా చిలుకమ్మ (38), ఆమె సోదరి లక్ష్మి, ఆమె భర్త రామారావు కలిసి ఓటేయడానికి నిర్ణయించుకున్నారు.
ఓటేసి వచ్చిన తర్వాత నర్సింహారావు అంత్యక్రియలు నిర్వహించాలని అనుకున్నారు. భర్త శవాన్ని ఇంటి వద్ద వదిలేసి ఐదు కిలోమీటర్ల దూరం నడిచి కిటుముల చేరుకుని చిలుకమ్మ ఓటేసింది. విషయం తెలిసి పోలింగ్ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఒక్క ఓటుతో విజయం
ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం మున్నంగివారి పాలెంలో సర్పంచిగా పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ మద్దతుదారు చెరుకూరి నాగేశ్వర రావు ఒక్క ఓటుతో విజయం సాధించారు.
సర్పంచి అభ్యర్థి భార్యపై దాడి
కరీంనగర్ జిల్లా రామగుండం మండలం సోమనపల్లిలో సర్పంచి అభ్యర్థి భార్యపై ప్రత్యర్థులు దాడి చేశారు. గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications