టిడిపి హవా: చంద్రబాబు హ్యాపీ, చెంపపెట్టని హరికృష్ణ

Harikrishna - Chandrababu Naidu
హైదరాబాద్: పంచాయతీ తొలి విడత ఎన్నికలలో తమ పార్టీ మద్దతుదారులను ఎక్కువ స్థానాలలో గెలిపించినందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణలు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి వసూళ్ల పార్టీ అని, ఆ పార్టీ మద్దతుదారులను కూడా తెలంగాణ ప్రజలు నిర్ద్వంధంగా తిరస్కరించారన్నారు.

టిడిపికి అండగా ఉన్నందుకు ఓటర్లకు, గెలుపునకు కృషి చేసినందుకు కార్యకర్తలకు ధన్యవాదాలు అన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో కాంగ్రెసు పార్టీ ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చిందని విమర్శించారు. పాలనను అస్తవ్యస్థం చేసిందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి, విద్యుత్ కోతలతో మంచినీటి పథకాలు మూలనపడేలా చేశాయన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డ పిల్ల కాంగ్రెసును తిరస్కరించి ప్రజలు విజ్ఞతతో వ్యవహరించారన్నారు.

పంచాయతీ ఎన్నికల రెండో దశ, మూడో దశలోను తల్లి కాంగ్రెసు, పిల్ల కాంగ్రెసు, తెరాస మద్దతుదారులను మట్టికరిపించి టిడిపి మద్దతుదారులను గెలిపించాలని కోరారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు టిడిపికే వేయాలని, ఇతర పార్టీలకు వేసినా ఉపయోగం ఉండదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు, తెరాసలకు ఓటు వేసినా ఉపయోగం ఉండదన్నారు. ధన బలం, అధికార దుర్వినియోగంతో అధికార పార్టీ అనేక అడ్డంకులు సృష్టించినా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆ ప్రయత్నాలను తిప్పికొట్టారన్నారు.

పంచాయతీ తొలి దశ ఎన్నికల్లో టిడిపిని గెలిపించినందుకు ఓటర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. స్వార్థ రాజకీయాలు చేద్దామనుకున్న పార్టీలకు ఫలితాలు చెంప పెట్టు అన్నారు. తొమ్మిదేళ్ల కాంగ్రెసు పాలన పట్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో తెలుస్తోందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+