జగన్ చెవిలో టి హీట్!: మరో రాజీనామా, ఒత్తిడేవల్లేనా?

పదిహేను రోజుల క్రితం కడప జిల్లాకు చెందిన ఆదినారాయణ రెడ్డి, శ్రీనివాసాలు, ఒక ఎమ్మెల్సీ రాజీనామా చేసినా అది చల్లారిపోయింది. ఈ రోజు అదే జిల్లాకు చెందిన కమలాపురం కాంగ్రెసు పార్టీ శాసన సభ్యుడు వీరశివా రెడ్డి రాజీనామా చేశారు. సీమాంధ్ర మంత్రులు సమైక్యాంధ్ర కోసం భేటీలు జరుపుతున్నారు. ఢిల్లీ వెళ్లేందుకు కూడా సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో విభజన పోరులో వెనుకబడతామనే ఒత్తిడితోనే జగన్ పార్టీ కూడా రాజీనామాల వేడిని రాజేసినట్లుగా కనిపిస్తోందంటున్నారు.
తెలంగాణకు అనుకూలంగా జోరుగా ప్రచారం సాగుతుండటంతో ఈ రోజు వీరశివా రాజీనామా చేసిన వెంటనే బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేశారు. తమ పార్టీ నేతల రాజీనామాలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణ నేత జిట్టా బాలకృష్ణా రెడ్డి, ఇతర నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జగన్ పార్టీ విభజన లొల్లి ప్రారంభమైంది. ఈ విషయాన్ని జగన్ చెవిలో వేసినట్లుగా తెలుస్తోంది.
గుర్నాథ్ రెడ్డి రాజీనామా
మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అనంతపురం ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి కూడా రాజీనామా చేశారు. రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెసు పార్టీ వైఖరికి నిరసనగా రాజీనామాలు చేస్తున్నట్లు చెప్పారు. మొదట కాంగ్రెసు వైఖరి చెప్పాలని, ఆ తర్వాతే సంప్రదింపులు జరపాలని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో చెలగాటమాడవద్దని చెబుతున్నారు. రాజీనామా బాటలో పార్టీకి చెందిన మరికొందరు సిద్దమవుతున్నట్లుగా తెలుస్తోంది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications