నిర్ణయం జరిగిపోయింది!: టిపై పెదవి విప్పిన సోనియా

ఇప్పటికే నిర్ణయం జరిగిపోయిందని, ఈ దశలో వెనక్కి వెళ్లలేమని చెప్పారు. ఈ ఒక్కరోజులోనే అయిపోయిందని అనుకోవద్దని ఆమె సీమాంధ్ర నేతలతో చెప్పారు. ఎవరు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. మీ ప్రాంతాలకు అన్యాయం జరగకుండా చూస్తామని ఆమె చెప్పారు. ఒత్తిళ్లకు తలొగ్గబోమని, విభజన అనివార్యమని సోనియా అన్నారు.
సోనియా గాంధీ తెలంగాణకు అనుకూలంగానే ఉన్నట్లు మొదటి నుండి వార్తలు వస్తున్నాయి. అయితే ఆమె మదిలో ఏముందనేది మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ తెలియలేదు. నిర్ణయం జరిగిపోయిన ఈ దశలో తనను కలిసిన సీమాంధ్ర నేతలతో... నిర్ణయం జరిగిపోయిందని చెప్పారు.
సీమాంధ్ర నేతల రాజీనామాల హెచ్చరికలను కాంగ్రెసు పార్టీ అధిష్టానం పెద్దగా పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు. తాము ఎప్పటి నుండో దీనిపై సంప్రదింపులు జరుపుతున్నామని, వాటి ద్వారా నిర్ణయం తీసుకున్నామని అధిష్టానం పెద్దలు తమను కలుస్తున్న నేతలకు చెబుతున్నారట.












Click it and Unblock the Notifications