టి ప్రపంచవ్యాప్తం: 29వ రాష్ట్రమంటూ బిబిసిలో వార్త
దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ అంశం చర్చనీయాంశమైంది. బిబిసిలో తెలంగాణపై ప్రముఖంగా వార్త వచ్చింది. భారత్లోని తెలంగాణ రాష్ట్రంపై నిర్ణయం వెలువడవచ్చునని బిబిసి వార్తను ప్రముఖంగా ఇచ్చింది. తెలంగాణ ఇస్తే 29వ రాష్ట్రంగా ఏర్పడుతుందని పేర్కోంది. ఓయు గేటు వద్ద విద్యార్థులు ఆందోళన చేస్తున్న ఫోటోను ఉంచింది.
భారత దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెసు పార్టీ ఈ రోజు సాయంత్రం 'దక్షిణ భారత' ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనుందని, ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు జరుగుతున్నాయని, దాదాపు నలభై మిలియన్ల ప్రజలు ఉన్న పది జిల్లాలతో పాటు హైదరాబాదుతో కూడిన తెలంగాణను కోరుకుంటుందని రాసింది.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర వార్తల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు టివిలకు అతుక్కుపోయారు. రాష్ట్ర పరిణామాల పైన ఆంధ్ర ప్రదేశ్లో ఉన్న తమ బంధువుల నుండి సమాచారం తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.