దద్దమ్మలు: టిడిపిపై జోగి నిప్పులు, కెవిపి మంతనాలు

 Telangana: Jogi fires at Seemandhra TDP leaders
న్యూఢిల్లీ/విజయవాడ: రాష్ట్రం ముక్కలవుతుంటే తెలుగు వారి కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీ ఏం చేస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత జోగి రమేష్ మంగళవారం విజయవాడలో నిప్పులు చెరిగారు. సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ నేతలు దద్దమ్మలు అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే తాము ఎట్టి పరిస్థితుల్లోను సహించేది లేదన్నారు.

తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగు జాతి ముక్కలవుతుంటే ఏం చేస్తోందన్నారు. పార్టీలను పక్కన పెట్టి ఉద్యమానికి సిద్దం కావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోను సమైక్యంగానే ఉంచాలన్నారు.

సీమాంధ్రలో నిరసనలు

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నేటి సాయంత్రం ఓ ప్రకటన వెలువడుతున్న నేపథ్యంలో సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి, సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాసలు ఆందోళనలు ఉధృతం చేశాయి. విశాఖలో ఆంధ్రా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. అనంతపురం ప్రధాన ద్వారం వద్ద సిడబ్ల్యూసి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నేతల ఇళ్లను చుట్టుముట్టారు.

కెవిపితో మంతనాలు

విభజనను అడ్డుకునేందుకు సీమాంధ్ర ప్రాంత నేతలు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు నివాసంలో భేటీ అయ్యారు.

మద్దతిస్తామా లేదా చెప్పలేం: మాగుంట

తెలంగాణపై పార్లమెంటులో బిల్లు పెడితే మద్దతిస్తామా లేదా అన్నది తాము ఇప్పుడే చెప్పలేమని ఎంపి మాగుంట శ్రీనివాసులు అన్నారు. తాము రాజీనామాలు చేస్తామని చెప్పలేదని, రాజీనామాలు సమస్యకు పరిష్కారం కాదన్నారు. సమైక్యవాదనను సిడబ్ల్యూసిలో వినిపిస్తానని రాష్ట్ర పార్టీ పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ హామీ ఇచ్చారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+