వంద కోట్లకు రాజ్యసభ సీటు: ఎంపి వివాదాస్పద వ్యాఖ్య
"రాజ్యసభ ఎంపీ కావడానికి వంద కోట్ల బడ్జెట్ కేటాయించుకున్నట్లు ఒక ఎంపీ నాతో చెప్పాడు. ఎంపికయ్యాక అతనికైన మొత్తం ఖర్చును లెక్కించుకుంటే రూ.20 కోట్లు మిగిలాయి. అంటే రూ. 80 కోట్లు ఖర్చు చేశాడు. ఆలోచించండి! వంద కోట్లు చెల్లించి రాజ్యసభ ఎంపీ కాగలిగినే వాళ్లు... పేదల గురించి ఏం ఆలోచిస్తారు'' అని బీరేందర్ సింగ్ అన్నారు.
దీనిపై బిజెపి తీవ్రంగా స్పందించింది. ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకోవడం కాంగ్రెస్కు అలవాటేనని, దేశంలో రాజకీయాలను ఆ పార్టీ భ్రష్టు పట్టించిందని విమర్శించింది.
అయితే తన వ్యాఖ్యలపై బీరేందర్ సింగ్ వివరణ ఇచ్చుకున్నారు. 'కొత్త రకం రాజకీయ వర్గం తయారైందన్నది నా మాటలకు అర్థం. ధనబలం గల వారే ఎక్కువగా లోక్సభ, రాజ్యసభలోకి ప్రవేశిస్తున్నారు. నేను పత్రికల్లో వచ్చిన దాన్నే ఉటంకించాను. 2009 లోక్సభ ఎన్నికల తర్వాత పార్లమెంటులో 360మంది కోటీశ్వరులు, వీరిలో కొందరు కుబేరులు ఉన్నట్లు ఓ పత్రికలో వచ్చింది' అని బీరేందర్సింగ్ వివరణ ఇచ్చారు.