వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ తెలివితేటలపై డిఎల్, స్పృహతప్పి పడిన బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

DL Ravindra Reddy
కడప/అనంతపురం/కృష్ణా: కిరణ్ కుమార్ రెడ్డిని ఎందుకు ముఖ్యమంత్రిని చేశారో తనకు అర్థం కావడం లేదని, ఆయనది నియోజకవర్గస్థాయి తెలివి తేటలు అని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ఆదివారం ఎద్దేవా చేశారు. తాను సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేస్తున్నానని చెప్పారు. తన రాజీనామా పత్రాన్ని సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితికి ఇస్తానని అన్నారు. కిరణ్, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు రాజీనామా చేస్తే సమైక్యాంధ్రపై స్పష్టత వస్తుందన్నారు.

సమైక్యవాదం వినిపిస్తా: చింతా

రాజీనామాల వల్ల ఉపయోగం లేదని ఎంపి చింతా మోహన్ అన్నారు. సమైక్యాంధ్ర కోసం అంటూ కొందరు ఉత్తుత్తి రాజీనామాలు చేస్తున్నారని ఆరోపించారు. అధిష్టానం వద్ద తాను సమైక్యవాదాన్ని బలంగా వినిపిస్తానని చెప్పారు. పలువురు సమైక్యవాదులు ఆయనను అడ్డుకోవడంతో రాజీనామాపై తన నిర్ణయాన్ని సాయంత్రం చెబుతానన్నారు.

ఉద్యమంలో మండలి

సమైక్యాంద్రకు మద్దతుగా మండలి బుద్ద ప్రసాద్ కృష్ణా జిల్లా అవనిగడ్డలో భారీ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెసు పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం విభజనకు పూనుకుందని మండిపడ్డారు. ఇందిర బాటను వీడిన కాంగ్రెసు నేతలకు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

స్పృహతప్పి పడిపోయిన సికె బాబు

సమైక్యాంధ్ర కోసం మూడు రోజులుగా దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే సికె బాబు ఆదివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన నీరసంతో స్పృహతప్పి పడిపోయారు. వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించారు.

English summary

 Former Minister DL Ravindra Reddy has blamed CM Kiran Kumar Reddy on Sunday. He was resigned for his post to support Samaikyandhra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X