హామీ వచ్చింది: టిపై లగడపాటి, సతీష్ రెడ్డి రాజీనామా

Lagadapati Rajagopal
న్యూఢిల్లీ/హైదరాబాద్: విభజన ప్రక్రియ ముందుగు సాగదని తమకు కేంద్రం నుండి హామీ వచ్చిందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ బుధవారం అన్నారు. ఈ రోజు లగడపాటి నివాసంలో సీమాంధ్ర ఎంపీలు భేటీ అయ్యారు. హర్ష కుమార్, ఎస్పీవై రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కెవిపి రామచంద్ర రావు, సాయి ప్రతాప్, అనంత వెంకట్రామి రెడ్డిలు సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం లగడపాటి మాట్లాడారు.

రాష్ట్ర సమైక్యత కోసం కాంగ్రెసు ఎంపీలుగా ఏం చేయాలో అది చేస్తున్నామన్నారు. కేవలం సీమాంధ్ర కాంగ్రెసు నేతల వల్లనే ఇన్నాళ్లు రాష్ట్రం సమైక్యంగా ఉందన్నారు. విభజన ప్రక్రియ ఆగిపోయినట్లుగా తమకు తెలుస్తోందని, దీనిని అధికారికంగా ప్రకటించాలని లగడపాటి డిమాండ్ చేశారు. ఎకె ఆంటోనీ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీకి తమ అభిప్రాయాలు, అనుమానాలను తెలియజేస్తామని అన్నారు. ఆంటోనీ కమిటీ నివేదిక ఇచ్చాకే విభజన ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు.

ప్రధాని అపాయింటుమెంట్ కోరిన కర్నూలు నేతలు

విభజన ప్రక్రియ ఆపే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు నేతలు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అపాయింటుమెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అపాయింటుమెంట్ దొరికితే విభజన వద్దని ఆయనను కోరనున్నారు. విభజనతో సీమ ప్రాంతానికి ఇబ్బందులని వారు చెప్పనున్నారు.

మరోవైపు సీమాంధ్ర ప్రాంతంలో ఎనిమిదో రోజు నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలు కాపాడాలంటూ టిడిపి ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి రాజీనామా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+