కిరణ్ మీడియా సమావేశం, ఉద్యోగుల్ని కల్పిన బోనాలు
సచివాలయంలో సహపంక్తి భోజనం
కాంగ్రెసు పార్టీ విభజనకు అనుకూలంగా నిర్ణయాన్ని ప్రకటించాక సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. వారు ఐదు రోజులుగా సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్నారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేస్తూ రాష్ట్రాన్ని విభజించవద్దని విధులను కూడా బహిష్కరించారు. కొన్ని సందర్భాలలో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు పోటా పోటీ నినాదాలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.
కానీ, ఈ రోజు సచివాలయంలో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు కలిసిపోయారు! సహపంక్తి భోజనం చేశారు. తెలంగాణ ప్రాంతంలో బోనాల పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సచివాలయంలోని అమ్మవారి తెలంగాణ ఉద్యోగులు బోనాల పండుగ చేసుకున్నారు.
దీంతో సీమాంధ్ర ఉద్యోగులు రోజులా కాకుండా మౌన ప్రదర్శన చేశారు. బోనాల పండుగ జాతర ఉన్నందున ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే తాము మౌన ప్రదర్శన చేస్తున్నామని చెప్పారు. అనంతరం ఇరు ప్రాంత ఉద్యోగులు సహపంక్తి భోజనం చేశారు.