బైక్ నడిపి బాబుపై మండిపడ్డ రోజా, పవర్లెస్: మైసూరా
స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది అంటే చంద్రబాబు మాత్రం తెలుగు జాతి మనది రెండుగ చీలిన జాతి మనది అంటున్నారని ఎద్దేవా చేశారు. తొమ్మిదేళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు.
పవర్లెస్ కమిటీ: మైసూరా
కాంగ్రెసు పార్టీ అధిష్టానం నియమించిన హైలెవల్ కమిటీ.. పవర్లెస్ కమిటీ అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మైసూరా రెడ్డి గురువారం ఎద్దేవా చేశారు. ఎకె ఆంటోని కమిటీ నియామకం వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. సీమాంధ్ర ఉద్యమంలో చీలిక తెచ్చి, రాజకీయ లబ్ధి పొందేందుకే ఎకె ఆంటోనీ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించిందన్నారు. విభజనకు హైదరాబాద్, జలవనరుల పంపిణీయే అసలు సమస్య అన్నారు.
కాంగ్రెసు విభజన విషయాన్ని సొంతింటి వ్యవహారంల భావించి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. ప్రజల కోసం ఆలోచించకపోవడం సరికాదన్నారు. ఎంపీల నిరసన ఓ రాజకీయ డ్రామా అన్నారు. చిత్తశుద్ధి ఉంటే వారు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తెలంగాణపై వైఖరి మార్చుకోనని చెబుతుంటే ఆ పార్టీ ఎంపీలు సభలో ఆందోళన చేయడం ఏమిటన్నారు. ఆందోళనలో పాల్గొంటే కేసులు పెడతామని డిజిపి హెచ్చరిస్తున్నారని, తాము అధికారంలోకి వస్తే వాటిని ఎత్తివేస్తామన్నారు. విభజనపై బాబు వ్యాఖ్యలు దురదృష్టకరమని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి అన్నారు.