చంద్రబాబుతోనే హైదరాబాద్ అభివృద్ధి: ఎర్రబెల్లి దయాకర్
తెలంగాణ పోరు ఈనాటిది కాదన్నారు. యాభై ఏళ్లుగా ఉద్యమం ఉందన్నారు. ఉద్యమాలను ప్రోత్సహించి, అణగదొక్కడం కాంగ్రెసు పార్టీ ఎప్పటి నుండో చేస్తోందని ఆరోపించారు. నాడు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అధికార దాహంతో చిన్నారెడ్డి నాయకత్వాన్ని ప్రోత్సహించారని, ఆ తర్వాత వైయస్, ఏఐసిసి అధ్యక్షురాలు కుమ్మక్కై తెలంగాణ రాష్ట్ర సమితితో 2004లో తెలంగాణ ఇస్తామని చెప్పి పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు.
కాంగ్రెసు పార్టీలోని రాజకీయ నిరుద్యోగులే ఉద్యమాన్ని ఎప్పటికప్పుడు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడతామని ఇప్పటి వరకు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. విభజనపై నిర్ణయం తీసుకున్న కాంగ్రెసు హైదరాబాదును ఏం చేస్తారో ఇప్పటి వరకు స్పష్టంగా చెప్పలేదన్నారు. హైదరాబాద్ ఆదాయం ఎటు వెళ్తుంది, ఎవరి కంట్రోల్లో ఉంటుందనే విషయమాలపై స్పష్టత ఇవ్వాలన్నారు.
ఎకె ఆంటోని నేతృత్వంలోని కమిటీ వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. కాంగ్రెసు పార్టీ కోర్ కమిటీ కేవలం ఆ పార్టీ వారి కోసమే అన్నారు. పార్లమెంటు సమావేశాలలో బిల్లు పెడతామి ఇంత వరకు పెట్టలేదన్నారు. బిసి మహిళా రిజర్వేషన్ కల్పించడం తెలుగుదేశంలోనే జరిగిందన్నారు.