పదవిలో ఉండి కిరణే సమస్య చెప్తే ఎలా?: సోమిరెడ్డి

Somireddy Chandramohan Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డే సమస్యలు చెబితే... పరిష్కారం చూపించేదెవరని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురువారం ప్రశ్నించారు. సీమాంధ్రలో గత తొమ్మిది రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రజలు లేవనెత్తుతున్న అంశాలనే ముఖ్యమంత్రి మాట్లాడారని, పదవిలో ఉండి ఆయన కూడా సామాన్యుని మాదిరి సమస్యలు ఏకరువు పెడితే ఆ మాటలకు విలువేముంటుందన్నారు.

విభజన నిర్ణయం కాంగ్రెస్ పార్టీదే తప్ప ప్రభుత్వానిది కాదన్న ముఖ్యమంత్రి వాదన అసంబద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం తీసుకొన్న కాంగ్రెస్ కమిటీలో యూపిఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, ఆర్థిక మంత్రి చిదంబరం వంటివారు ఉన్నారని, దేశాన్ని పాలించేది కాంగ్రెస్ పార్టీనా... వేరే పార్టీనా? చెప్పాలన్నారు.

గత పదిహేను రోజులుగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తాము మాట్లాడుతున్న విషయాలనే ముఖ్యమంత్రి కూడా మాట్లాడారని, వాటిపై స్పష్టత కావాలని తమ పార్టీ డిమాండ్ చేస్తున్నామని, అవి తేలిన తర్వాతే పార్లమెంటులో బిల్లు పెట్టాలన్నది తమ డిమాండ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకంలో మరో భాగమే ఆంటోనీ కమిటీ అని తెదేపా సీమాంధ్ర నేత, శాసనమండలి పక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు.

ఎనిమిదిన్నర కోట్ల ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశంపై కాంగ్రెస్ ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు. సొంత రాష్ట్రాల ప్రయోజనాల కోసం చిదంబరం, వీరప్ప మొయిలీ తెలుగు జాతిని ముక్కలు చేశారు. వారినే మళ్లీ ఆంటోనీ కమిటీలో సభ్యులుగా వేశారు. దీనిని బట్టే ఈ కమిటీ నిజ స్వరూపం తెలుస్తోందని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+