వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోరం: ప్రియుడితో కలిసి అత్తను చంపిన మహిళ

By Pratap
|
Google Oneindia TeluguNews

murder
బెంగళూర్: తమ సంబంధానికి ఆటంకంగా మారిందనే కోపంతో ప్రియుడితో కలిసి ఓ మహిళను అత్తను పొట్టన పెట్టుకుంది. బెంగళూర్‌లోని జెసి నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. గత నాలుగేళ్లుగా వారిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోంది. తనకు బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో 40 ఏళ్ల వయసు గల మహిళ తన ప్రియుడితో కలిసి అత్తను హత్య చేసింది.

మృతురాలిని సలీమున్నీషా (62)గా గుర్తించారు. ఆమె తన కుమారుడు అల్లా బక్ష్, భార్య ప్రవీణ్, వారి పిల్లలతో కలిసి ఉంటోంది. సలీమున్నీషా వికలాంగురాలని, ఇంటి వద్దనే ఉండనే ప్రవీణ్ ఆమె బాగోగులు చూసుకోవాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు.

తన పిల్లలు చదువుకునే బడి వద్ద నాలుగేళ్ల క్రితం ప్రవీణ్‌కు స్క్రాప్ డీలర్ రఫీక్ (45)తో పరిచయమైంది. అప్పటి నుంచి వారిద్దరి మధ్య వైవాహికేతర సంబంధం కొనసాగుతోంది. భర్త, పిల్లలు లేనప్పుడు రఫీక్ ప్రవీణ్ ఇంటికి వస్తుండేవాడు. ప్రవీణ్ అత్త గదికి బయటి నుంచి తాళం వేసేది.

లగేజ్ ఆటో డ్రైవర్‌గా పనిచేసే అల్లా భక్స్‌కు తన భార్య వైవాహికేతర సంబంధం గురించి తెలిసింది. దానిపై భార్యాభర్తల మధ్య తరుచుగా గొడవ జరుగుతుండేది. ప్రవీణ్, సలీమున్నిషా మాత్రమే ఉన్నప్పుడు రఫీక్ తన ఇంటికి వస్తున్నట్లు మాత్రం తెలియదు.

తన కోడలికి, రఫీక్‌కు మధ్య ఏం జరుగుతుందనే విషయం సలీమున్నిషాకు తెలియదు. తాను అనుకున్నప్పుడల్లా బయటకు వెళ్లలేకపోవడం, దానికి 62 ఏళ్ల తన అత్త ఆటంకంగా మారడం ప్రవీణ్‌ను అసంతృప్తికి గురిచేసింది. దాంతో ప్రియుడితో కలిసి ప్రవీణ్ సలీమున్నిషాను హత్య చేసింది. వారిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

English summary
An illicit relationship that had lasted for four years ended in the murder of a witness, whom the accused considered a hindrance to their affair.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X