అసమర్థత కాదు: ఈటెల, భర్తల్ని అడగాలని భార్యలకు..

కిరణ్ సీమాంధ్రకే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారన్నారు. కిరణ్ పైన తెలంగాణ ప్రాంత ప్రజలకు విశ్వాసం లేదని, ఆయనకు పాలించే హక్కు లేదన్నారు. ఇరు ప్రాంత ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టవద్దన్నారు. సీమాంధ్రులు తమను ఎంత రెచ్చగొట్టినా తాము శాంతియుతంగానే ఉంటామన్నారు.
తెలంగాణపై మంత్రివర్గం త్వరగా తీర్మానం చేయాలనే డిమాండుతో ఆగస్టు 17 నుండి శాంతిర్యాలీలు నిర్వహిస్తామని తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ ఆచార్య కోదండరామ్ అన్నారు. 17న ఇందిరా పార్కు వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు చెప్పారు. నెలాఖరున హైదరాబాదులో శాంతిర్యాలీ నిర్వహిస్తామన్నారు. తెలంగాణ ఆకాంక్షకు సీమాంధ్ర నేతలు అడ్డుపడటం సరికాదన్నారు. ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్ర ఏర్పాటు ఆగదన్నారు.
సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె రాజ్యాంగ విరుద్ధమన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు ఇస్తామన్నారు. సీమాంధ్ర ప్రాంతం వెనుకబాటుకు సీమాంధ్ర నేతలే కారణమన్నారు. ఆ విషయంలో సీమాంధ్ర ప్రాంత మంత్రులను వారి భార్యలే నిలదీయాలని సూచించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేల భార్యలు గవర్నర్ను కలిసి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications