వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసమర్థత కాదు: ఈటెల, భర్తల్ని అడగాలని భార్యలకు..

By Srinivas
|
Google Oneindia TeluguNews

etela rajender and kodandaram
హైదరాబాద్: తమ సహనాన్ని అసమర్థతగా భావించవద్దని, సీమాంధ్ర ప్రాంత నేతలు సమైక్య ఉద్యమం పేరుతో హింసామార్గాన్ని ఎన్నుకున్నా, తమది మాత్రం శాంతిమార్గమేమనని తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్ మంగళవారం అన్నారు. సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి అధిష్టానాన్ని ధిక్కరిస్తారా అని ప్రశ్నించారు.

కిరణ్ సీమాంధ్రకే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారన్నారు. కిరణ్ పైన తెలంగాణ ప్రాంత ప్రజలకు విశ్వాసం లేదని, ఆయనకు పాలించే హక్కు లేదన్నారు. ఇరు ప్రాంత ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టవద్దన్నారు. సీమాంధ్రులు తమను ఎంత రెచ్చగొట్టినా తాము శాంతియుతంగానే ఉంటామన్నారు.

తెలంగాణపై మంత్రివర్గం త్వరగా తీర్మానం చేయాలనే డిమాండుతో ఆగస్టు 17 నుండి శాంతిర్యాలీలు నిర్వహిస్తామని తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ ఆచార్య కోదండరామ్ అన్నారు. 17న ఇందిరా పార్కు వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు చెప్పారు. నెలాఖరున హైదరాబాదులో శాంతిర్యాలీ నిర్వహిస్తామన్నారు. తెలంగాణ ఆకాంక్షకు సీమాంధ్ర నేతలు అడ్డుపడటం సరికాదన్నారు. ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్ర ఏర్పాటు ఆగదన్నారు.

సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె రాజ్యాంగ విరుద్ధమన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు ఇస్తామన్నారు. సీమాంధ్ర ప్రాంతం వెనుకబాటుకు సీమాంధ్ర నేతలే కారణమన్నారు. ఆ విషయంలో సీమాంధ్ర ప్రాంత మంత్రులను వారి భార్యలే నిలదీయాలని సూచించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేల భార్యలు గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

English summary
Telangana Political JAC chairman Kodandaram on Tuesday suggested ministers and MLAs wives to question their husbands.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X