జగన్ కేసు: మోపిదేవికి సిబిఐ కోర్టులో చుక్కెదురు

గతంలో ఓసారి కోర్టు ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. అయ్యప్ప మాలధారణలో ఉన్న మోపిదేవికి శబరిమల వెళ్లేందుకు ఈ ఏడాది జనవరి 2వ తేది వరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) కోర్టు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. నిరుడు డిసెంబర్ 24వ తేదీన నుంచి ఈ ఏడాది ఏడాది జనవరి 2వ తేదీ వరకు కోర్టు ఆయనకు ఈ బెయిల్ మంజూరు చేసింది.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అస్తుల కేసులో ఆబ్కారీ మంత్రి మోపిదేవి వెంకటరమణను సిబిఐ అధికారులు నిరుడు మే 24వ తేదీన అరెస్టు చేశారు. సిబిఐ విచారణకు హాజరైన మోపిదేవిని అరెస్టు చేశారు. వాన్పిక్ భూముల కేటాయింపులో ఆయన అరెస్టయ్యారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల మంత్రిగా పనిచేసిన మోపిదేవి వాన్పిక్ భూముల కేటాయింపులో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో సిబిఐ చార్జిషీట్ కూడా దాఖలు చేసింది.












Click it and Unblock the Notifications