కోటి తీసుకో: కెసిఆర్కు టిజి వెంకటేష్ తనయుడి ఆఫర్
ఈ సందర్భంగా మాట్లాడారు. కెసిఆర్ సమైక్యాంధ్రకు జైకొడితే విరాళాలు సేకరించి కోరినంత డబ్బు ఇవ్వగలమని అన్నారు. తెలంగాణ ఉద్యమం ద్వారా ముఖ్యమంత్రి సీటును, దాని ద్వారా డబ్బు సంపాదనే కెసిఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. కెసిఆర్కు డబ్బులివ్వడానికి తన టిజివి గ్రూప్ నుంచి కోటి రూపాయలు విరాళంగా ప్రకటించి దానికి సంబంధించిన చెక్ను మీడియాకు ప్రదర్శించారు.
ఇంతేగాక కెసిఆర్ సమైక్యాంధ్రకు అనుకూలంగా మారితే కోరినంత డబ్బు ఇవ్వడానికి సిద్ధమవుతామని, అందుకు విరాళాల కోసం పిలుపునిచ్చారు. ఇప్పటికే 40 చెక్కులు సిద్ధమైనట్లు ప్రకటించారు. సీమాంధ్ర ప్రజలు ఇచ్చే డబ్బుతో 10 ఫామ్ హౌస్లు కట్టించుకుని తెలంగాణవాదం నుంచి వైదొలగాలని సూచించారు. కాగా, తమను చులకన చేస్తూ ఇష్టానుసారం మాట్లాడితే సహించబోమని, నోరు అదుపులో పెట్టుకోవాలని భరత్ను తెరాస హెచ్చరించింది.
ముఖ్యమంత్రితే కేంద్రమంత్రి భేటీ
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో క్యాంపు కార్యాలయంలో కేంద్రమంత్రి జైరామ్ రమేష్ ఆదివారం సమావేశమయ్యారు.
ఎస్మా ప్రయోగం దురదృష్టకరం: బాపిరాజు
సీమాంధ్రలో ఎపిఎన్జీవోలపై ఎస్మా ప్రయోగం దురదృష్టకరమని టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పెట్టుబడిదారులు ఉన్నారన్న ఆరోపణలు వాస్తవం కాదన్నారు. కిరణ్ ధైర్యవంతుడని, ఆయనకు తాము మద్దతిస్తున్నామన్నారు. సరైన సమయంలో తాను రాజీనామా చేస్తానని చెప్పారు.