తాగి విమానాశ్రయంలో వీరంగం సృష్టించిన మహిళాటెక్కీ
అక్కడ పిల్లలు, తల్లిదండ్రులను, అడ్డుకున్న సిబ్బందిని దూషించి వీరంగం సృష్టించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆమెను, ఆమెతో ఉన్న మిగిలిన వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆమె శనివారం పబ్బులో ఫుల్గా మందు తాగి కారు రేసింగ్లో కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. మద్యం మత్తులో స్పీడ్గా వెళ్తున్న ఆమెను పోలీసులు పట్టుకొని కౌన్సెలింగ్ కూడా ఇప్పించి పంపించారు. ఆ తర్వాత విమానాశ్రయంలో వీరంగం సృష్టించింది.
తల్లీకొడుకు దారుణ హత్య
అదిలాబాద్ జిల్లా మంచిర్యాలలోని శ్రీశ్రీ నగర్లో తల్లీకొడుకు దారుణ హత్యకు గురయ్యారు. చోరీకి పాల్పడిన దుండగులు దుర్గమ్మను, ఆమె కొడుకు రవీంద్రను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
సినీ పక్కీలో దోపిడీ
విశాఖ జిల్లా అనకాపల్లిలోని బంగారం వ్యాపారి నుండి రూ.కోటి విలువ చేసే బంగారు అభరణాలు, డబ్బు కలిగిన బ్యాగును కొందరు దుండగులు సినీ పక్కీలో అపహరించారు. ఈ ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. బంగారం వ్యాపారి రాత్రి పది గంటలకు దుకాణం మూసివేసి కొంత బంగారం, నగదును మోటారు సైకిల్ పైన పెట్టుకొని తన ఇంటికి బయలుదేరారు.
సమీపంలోని ఐ కళాశాల ఎదురుగా వెళ్తున్న వాహనాన్ని ఇద్దరు వ్యక్తులు పల్సర్తో ఢీకొట్టారు. కింద పడిన బంగారం వ్యాపారి నుండి బ్యాగును లాక్కొని పారిపోయారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.