శ్రీశైలం టీ యాత్రాబస్సుకు బ్రేకులు: అసభ్యరాతలు
దాదాపు రెండు గంటల పాటు ఆర్టీసి బస్సులో వచ్చిన భక్తులతో పాటు డ్రైవర్, కండక్టర్తో పాటు రోడ్డుపైనే దిగ్బంధించారు. దీంతో భక్తులు సమైక్యవాదులను ఎంతగా వేడుకున్నా ఆందోళనకారులు వినలేదు. డ్రైవర్లు సాదక్ అలీ, కిష్టయ్య, కండక్టర్లు వెంకటేశ్వర్లు, ఎస్ఎం కుమార్లు భక్తులను ఇబ్బంది పెట్టొద్దని సమైక్యవాదులను ప్రాధేయపడ్డారు. దీంతో ఆగ్రహించిన సమైక్యవాదులు ఏకంగా డ్రైవర్ల ఉన్న డ్యూటీ కాగితాలను లాక్కొని అందులో జై సమైక్యాంధ్ర అంటూ రాశారు.
అదేవిధంగా కండక్టర్ల దగ్గర ఉన్నటువంటి ఎస్ఆర్ను తీసుకుని అందులో కూడా సమైక్యాంధ్ర అంటూ రాశారు. అదేవిధంగా సంగారెడ్డి బస్సుపై కెసిఆర్కు వ్యతిరేకంగా వాల్రైటింగ్ రాసి బస్సుతో పాటు శ్రీశైలంకు ఎవరు కూడా రావోద్దంటూ హుకుం జారీ చేశారు. బస్సుపై అసభ్యకరమైన రాతలు రాశారు. తమ ఆదేశాలను బేఖతారు చేస్తే బస్సును తగులబెడుతామని, దాడులు చేస్తామని హెచ్చరించారు.
దాంతో తప్పని పరిస్థితుల్లో మల్లికార్జునస్వామిని దర్శించుకోవల్సిన భక్తులు తిరిగి ఇంటి ముఖం పట్టారు. సంగారెడ్డి డిపోకు చెందిన బస్సు శ్రీశైలంకు వెళ్లకుండా సంగారెడ్డికి పయనమైంది. ఆదివారం రాత్రి ఆమనగల్లుకు చేరుకున్న భక్తులు సున్నిపెంటలో జరిగిన సంఘటనను తెలిపారు.