రైలు ఢీకోని 35మంది మృతి, బెంగళూర్లో కూలిన భవనం
మృతి చెందిన వారిలో ఎక్కువ మంది కన్వారియాస్(శివ భక్తులు)లు ఉన్నారు. రాజ్యరాణి ఎక్స్ప్రెస్ వస్తున్న సమయంలో వారు ఈస్ట్ సెంట్రల్ పరిధిలోని సమస్తిపుర డివిజన్లో బమారా స్టేషన్లో ట్రాక్ పైన నిలబడి ఆపే ప్రయత్నం చేశారు. సంఘటన స్థలంలోనే వేగంగా వెళ్తున్న రైలు కారణంగా 12 మంది చనిపోయారని అధికారులు చెప్పారు.
ఈ రైలు సహారా నుండి పాట్నా వెళ్తోంది. సంఘటన తర్వాత రైలు కొద్ది దూరం వెళ్లి ఆగింది. కోపోద్రిక్తులైన స్థానికులు డ్రైవర్ను లాగి కొట్టారు. ఆ తర్వాత బోగీకి నిప్పు పెట్టారు. ప్రమాదం కారణంగా ఆ మార్గంలో కొంతసేపటి వరకు రైళ్ల రాకపోకలు నిలిపివేసినట్లు అధికారులు చెప్పారు.
జమ్ముకాశ్మీర్లో స్వల్ప భూకంపం
జమ్ముకాశ్మీర్లోని కిష్ట్వార్లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.8గా నమోదైంది.
బెంగళూరులో కూలిన ఐదంతస్తుల భవనం
కర్నాటక రాజధాని బెంగళూరులో ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. హోసూరు రోడ్డులోని నిమ్హాన్స్ వద్ద నిర్మాణంలో ఉన్న ఈ భవనం కూలడంతో ఆరుగురు కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.