పాక్ సైన్యం భద్రతలో దావూద్, కరాచీలో కలిశా: తుండా

తాను ఏడాది క్రితం దావూద్ను కరాచీలో కలిసినట్లు ఇంటరాగేషన్ సమయంలో తుండా చెప్పినట్లు కూడా ఆ వర్గాలు తెలిపాయి.
దావూద్ ఇబ్రహీం తమ దేశంలో ఉన్నట్లు గతవారం పాక్ ఉన్నతాధికారి ఒకరు తొలిసారిగా అంగీకరించడం, ఆ తర్వాత కొద్ది గంటలకే మాట మార్చడం తెలిసిందే.
పాకిస్తాన్ అధికారులకు అందించిన నివేదికల్లో భారత భద్రతా అధికారులు పదే పదే దావూద్ ఇబ్రహీం పేరును, అతని వివరాలను అందించినప్పటికీ అతను తమ దేశంలో ఉన్నాడనే విషయాన్ని పాక్ ఇప్పటివరకు తోసిపుచ్చుతూ వచ్చింది. 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన 1993 నాటి ముంబయి వరస బాంబు పేలుళ్ల తర్వాత కరాచీకి పారిపోయిన దావూద్ అక్కడే ఉంటున్నట్లు వార్తలు వచ్చాయి.
దావూద్, ముంబయి ఉగ్రవాద దాడుల ప్రధాన కుట్రదారయిన జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్లతో తుండా రెగ్యులర్ టచ్లో ఉన్నట్లు కూడా ఢిల్లీ పోలీసులు చెప్తున్నారు. ఆగస్టు 15కు వారం రోజుల ముందు కూడా అతను హఫీజ్ను కలిశాడని అంటున్నారు. అంతేకాదు తుండాకు ఐఎస్ఐతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని, దానికి ఏజంట్లను రిక్రూట్ చేసే వాడిగా కూడా పని చేశాడని ఢిల్లీ పోలీసు వర్గాలు అంటున్నాయి.
అతను పాక్లో ఒక మదరసాల నెట్వర్క్ను కూడా నడుపుతున్నాడని తెలుస్తోంది. అను జుందాల్కన్నా కూడా తుండా పట్టుబడ్డం వల్ల ఎంతో ఉపయోగముందని, ఎందుకంటే పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్లలో టెర్రరిస్టు నెట్వర్క్ గురించి అతనికి బాగా తెలుసునని, బంగ్లాదేశ్లోని తన నెట్వర్క్లోని కార్యకర్తల ద్వారా ఉగ్రవాదులకు అవసరమైన మెటీరియల్ను, వ్యక్తులను భారత్లోకి ప్రవేశపెట్టేవాడని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications