వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోదరుడి అరెస్ట్: అసెంబ్లీ ముందు శంకరరావు మౌనదీక్ష

By Srinivas
|
Google Oneindia TeluguNews

Shankar Rao
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డిజిపి దినేష్ రెడ్డిలు తనను, తన కుటుంబ సభ్యులను వేధిస్తున్నారని ఆరోపిస్తూ మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, కంటోన్మెంట్ శాసన సభ్యుడు శంకర రావు మంగళవారం అసెంబ్లీ ముందు మౌనదీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

ముఖ్యమంత్రి, డిజిపిలు తమ కుటుంబ సభ్యులను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అక్రమ అరెస్టులు చేస్తూ వేధించడం ద్వారా తనపై ప్రతీకారం తీర్చుకుంటున్నారన్నారు. తన సోదరుడిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని శంకర రావు చెప్పారు.

తనపై వచ్చిన ఆరోపణలపై తాను విచారణకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ప్రభుత్వానికి దమ్ముంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)తో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

కాగా, శంకర రావు సోదరుడు దయానంద్‌ను సోమవారం ముషీరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రామ్ నగర్‌లోని జెమిని కాలనీలోని, అల్వాల్ మండలంలోని కానాజిగూడలో గ్రీన్ ఫీల్డు హౌసింగ్ సొసైటీలో శంకర రావుతో పాటు ఆయన సోదరుడు కూడా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన కేసులో నిందితుడని పోలీసులు తెలిపారు.

English summary
Former Minister and Congress Party senior MLA Shankar Rao on Tuesday protested at Assembly against his brother Dayanand arrest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X