ఇదీ పరిస్థితి, టి వద్దు!: సోనియాను కలవనున్న కిరణ్

కాగా, మంగళవారం రాత్రి ఆంటోని కమిటీని కలిసిన ముఖ్యమంత్రి సమైక్యమే అన్ని సమస్యలకు పరిష్కారమని సూచించిన విషయం తెలిసిందే. ఇరు ప్రాంతాలు పరస్పరం ఆధారపడ్డాయని, విభజన ఎవరికీ మంచిది కాదని చెప్పారు. విభజనతో కొత్త సమస్యలు వస్తాయే తప్ప పరిష్కారమయ్యేదేమీ ఉండదని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా జలవనరుల పంపిణీ, ఒక డ్యాంను రెండు ప్రాంతలు పంచుకోవడం వంటివి ఉంటాయన్నారు.
నీటి యుద్ధాలు జరిగే అవకాశముందని, ప్రజల మధ్య వైషమ్యాలు వస్తాయని చెప్పారు. విద్యుత్ విషయంలో తెలంగాణలో ఘోర పరిస్థితి ఏర్పడవచ్చునని, సీమాంధ్రులకు వైద్యానికి హైదరాబాద్ కేంద్రంగా ఉందని, విడిపోతే వారు ఇబ్బందులు పడతారని తెలిపారు.
ఢిల్లీలోనే సీమాంధ్ర నేతల మకాం
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధులు ఢిల్లీలోనే మకాం వేశారు. ఈ రోజు కూడా వారు పలువురు నేతలను కలిసి సమైక్యవాదం వినిపించనున్నారు. మంగళవారం రాత్రి ఆంటోని కమిటీని కలిసిన వారు సమైక్యవాదన వినిపించారు. హైదరాబాద్, నీళ్లు అసలు సమస్య అని చెప్పారు. విడదీస్తే నష్టమని, తెలంగాణపై రెండో ఎస్సార్సీ వేయాలని చెప్పారు. పలువురు రాయల తెలంగాణ విజ్ఞప్తి చేశారు. అయితే, సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ముందు అంటోని కమిటీ మౌనముద్ర వహించింది. వారు చెప్పిన విషయాలను సావధానంగా వినడం తప్పితే ఏం మాట్లాడలేదని సమాచారం.












Click it and Unblock the Notifications