బతుకమ్మ చేత్తో బరిశలకు సై: మజ్లిస్పై కవిత నిప్పులు
సీమాంధ్రులు తమ నుదుడి పైన మజ్లిస్ అని కాకుండా జై తెలంగాణ అని రాసుకుంటే ఆత్మీయంగా చూసుకుంటామని చెప్పారు. తెలంగాణపై కుయుక్తులు పన్నితే బతుకమ్మ ఎత్తిన చేతితోనే బరిశలు పడతామని హెచ్చరించారు. సెప్టెంబరు 7న శాంతియాత్ర చేపడతామన్నారు. మా ఉద్యోగాలు, మా నీళ్ల కోసమే తెలంగాణ అన్నారు.
బిల్లు పెట్టండి: వినోద్
కాంగ్రెసు పార్టీ అధిష్టానం అఖిల పక్షం వేసే ప్రయత్నాలను ఆపాలని తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత వినోద్ కుమార్ వేరుగా డిమాండ్ చేశారు. వేయాల్సింది అఖిల పక్షం కాదన్నారు. వెంటనే పార్లమెంటులో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు.
సుదర్శన్ చాంబర్లో టి నేతల భేటీ
భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్సన్ రెడ్డి చాంబర్లో పలువురు తెలంగాణ కాంగ్రెసు నేతలు భేటీ అయ్యారు. మంత్రులు సునిత లక్షామా రెడ్డి, జానా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, ప్రభుత్వ విప్ అనిల్లు భేటీ అయ్యారు. వారు ఢిల్లీ పరిణామాలపై చర్చించారు.