అందుకే రాద్ధాంతం: సుష్మ, చెప్పిందొకటి: శివ ప్రసాద్
చెప్పిందొకటి...: శివ ప్రసాద్
సభ ప్రారంభానికి ముందు విభజనపై అఖిల పక్షం వేస్తామని కమల్ నాథ్ తమతో చెప్పారని కానీ, సభలో మరోలా వ్యవహరించారని చిత్తూరు ఎంపి శివ ప్రసాద్ ఆరోపించారు. తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టింది కాంగ్రెసు పార్టీయే కాబట్టి చల్లార్చిన బాధ్యత ఆ పార్టీ పైనే ఉందన్నారు. మూడు ప్రాంతాల నుండి ఏకాభిప్రాయం వచ్చాకే నిర్ణయం చేయాలని శ్రీకృష్ణ కమిటీ చెప్పిందని, దీనిపై చర్చ జరగాలని కొణకళ్ల నారాయణ డిమాండ్ చేశారు.
తమను సస్పెన్షన్ చేయడాన్ని బిజెపి సహా అన్ని పార్టీలు వ్యతిరేకించాయన్నారు. తమ సస్పెన్షన్ పైన నిర్ణయం వెలువడలేదన్నారు. తమ రాజీనామాల ఆమోదానికి ఒత్తిడి తెస్తామన్నారు. సీమాంధ్రుల ప్రయోజనాలు కాపాడే వరకు తాము ఆందోళన చేస్తామన్నారు. సీమాంధ్ర ప్రజల గోసను తాము సభలో వినిపిస్తే సస్పెండ్ చేస్తారా అని నిమ్మల కిష్టప్ప ప్రశ్నించారు.
దోపిడీలు, కుంభకోణాలు చేసే వారిని ఎందుకు సస్పెండ్ చేయడం లేదన్నారు. సీమాంధ్రలో సామాజిక వర్గాల వారిగా ఉద్యమం జరగడం లేదన్నారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీకి ఏమైనా అనుమానాలు ఉంటే సీమాంధ్రలో పర్యటించి వాస్తవాలు తెలుసుకోవచ్చునని హితవు పలికారు.