సోనియాతో చిరు భేటీ, సభలోనే టిడిపి ఎంపీల నిరసన

sonia gandhi and chiranjeevi
న్యూఢిల్లీ: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి శుక్రవారం సాయంత్రం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఆయన రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై అధినేత్రికి వివరించనున్నట్లుగా సమాచారం. అదే సమయంలో విభజన విషయంలో సీమాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని ఆమెకు విజ్ఞప్తి చేయనున్నారని తెలుస్తోంది.

టిడిపి ఎంపీలను బయటకు తెచ్చిన భద్రతా సిబ్బంది

లోకసభ వాయిదా పడిన అనంతరం కూడా తెలుగుదేశం పార్టీలో సభలోనే నిరసన వ్యక్తం చేస్తుండటంతో భద్రతా సిబ్బంది వారిని బలవంతంగా బయటకు తీసుకు వచ్చారు. విభజనపై సభలో సీమాంధ్ర ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో స్పీకర్ మీరా కుమార్ సభను శనివారానికి వాయిదా వేశారు.

సభ వాయిదా పడిన అనంతరం కూడా టిడిపి ఎంపీలు సభలోనే బైఠాయించారు. తమ స్థానాల్లోనే కూర్చొని నిరసన తెలిపారు. వారిని బయటకు పంపించేందుకు అధికారులు మార్షల్స్ సహాయం తీసుకున్నారు. మార్షల్స్ బలవంతంగా వారిని బయటకు తీసుకు వచ్చారు.

శివ ప్రసాద్‌కు వైద్య పరీక్షలు

సస్పెండైన్ అనంతరం లోకసభలోనే ఆందోళన చేస్తున్న టిడిపి ఎంపి శివ ప్రసాద్‌కు వైద్యులు పరీక్షలు చేశారు. ఆయన బిపి, షుగర్ లెవల్స్ పడిపోయాయి. దీంతో వైద్యులు పరీక్షలు జరిపారు. ఎంపీలు సుజనా చౌదరి, సిఎం రమేష్‌లు వైద్యులను తీసుకు వెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+