ముంబై గ్యాంగ్ రేప్: ప్రశ్నలు కురిపించిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: ముంబైలో ఫొటోగ్రాఫర్పై జరిగిన సామూహిక అత్యాచారం విషయంలో దేశంఆందోళన సుప్రీంకోర్టులో ప్రతిబంబించింది. దేశంలో పెచ్చరిల్లుతున్న అత్యాచారాలపై ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది. వ్యవస్థలో ఉన్న తప్పేమిటి, 90 శాతం అత్యాచారం కేసుల్లో నిందితులు ఎందుకు నిర్దోషులుగా విడుదలవుతున్నారు అని ప్రశ్నిస్తూ పరిస్థితి విషమిస్తోందని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేశింది.
అత్యాచారాలు పదే పదే ఎందుకు జరుగుతున్నాయని, అది కూడా మెట్రోపాలిటన్ నగరాల్లోనే అవి ఎందుకు జరుగుతున్నాయని న్యాయమూర్తి ప్రశ్నించారు. హర్యానాలో సామూహిక అత్యాచారానికి గురైన మహిళ తండ్రి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఆ ప్రశ్నలు వేశారు.

పిటిషన్ కూతురికి హర్యానా ప్రభుత్వం భద్రత కల్పించలేకపోయిందా అని అడిగారు. తనపై దాడి గురించి ఫిర్యాదు చేసిన తర్వాత ఆమె తల్లిని కాల్చి చంపారని, ఆమెకు బెదిరింపులు వస్తున్నాయని కుటుంబ సభ్యులు చెప్పారు. అత్యాచార బాధితుల కోసం పునరావాస విధానాన్ని రూపొందించాలని న్యాయమూర్తి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు.
మహిళా ఫొటోగ్రాఫర్పై అత్యాచారానికి పాల్పడిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. త్వరలోనే చార్జిషీట్ దాఖలు చేస్తామని ముంబై పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ చెప్పారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications