వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లా విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ కేసు: ఆరుగురికి జీవిత ఖైదు

By Pratap
|
Google Oneindia TeluguNews

 life term
బెంగళూర్: న్యాయశాస్త్రం అభ్యసిస్తున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో సివిల్, సెషన్స్ కోర్టు శుక్రవారం ఆరుగురికి జీవిత ఖైదు విధించింది. నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్శిటీ (ఎన్ఎల్ఎస్ఐయు)లో న్యాయశాస్త్రం అభ్యసిస్తున్న విద్యార్థినిపై నిరుడు అక్టోబర్ 13వ తేదీన బెంగళూర్ విశ్వవిద్యాలయంలోని జ్ఝానభారతి ఆవరణలో సామూహిక అత్యాచారం జరిగింది.

ఈ కేసులోని ఎనిమిది నిందితుల్లో 24 ఏళ్ల రాజా పరారీలో ఉన్నాడు. ఎనిమిదో నిందితుడు మైనర్ కావడంతో బాలనేరస్థుల న్యాయస్థానం అతనిపై విచారణ జరుపుతోంది. ఆరుగురిని కేసులో దోషులుగా నిర్ధారించి సెషన్స్ న్యాయమూర్తి కృష్ణమూర్తి బి సంగనవార్ శిక్షను ఖరారు చేశారు.

ఈ కేసులో దోషులుగా తేలిన మద్దుర (20), దొడ్డీరయ్య (19), శివన్న (20), ఈరయ్య (20), ఎలయ్య (23), రామ (50) రామనగరం తాలూకా దాసేగౌడన గ్రామానికి చెందిన ఇరులిగ తెగకు చెందినవారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ 31 మంది సాక్షులను విచారించింది. విచారణ జూన్ 28వ తేదీన ప్రారంభమై ఆగస్టు 2వ తేదీన ముగిసింది.

కేసు విచారణలో 74 వస్తువులను, 79 పత్రాలను కోర్టుకు సమర్పించారు. పరీక్షలకు హాజరు కావాల్సి ఉండడంతో బాధితురాలికి కోర్టు ముందుకు రావడానికి 15 రోజుల సమయం ఇచ్చారు.

English summary
A civil and sessions court in Bangalore on Friday sentenced six persons to life term for gang-raping an undergraduate student of the National Law School of India University (NLSIU) on October 13 last year on Bangalore University's Jnanabharathi campus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X