విభజనపై సీఎం కిరణ్ డ్రామాలు: శ్రీకాంత్ రెడ్డి ఫైర్

సీఎం కిరణ్కుమార్రెడ్డి వల్లే రాష్ట్ర విభజన జరుగుతోందని శ్రీకాంత్రెడ్డి ఆరోపించారు. విభజనకు తాను కారణం కాదని కిరణ్ చెప్పగలరా? అని ఆయన ప్రశ్నించారు. అధిష్టానం పెద్దలతో ప్యాకేజీ గురించి చర్చించిన మాట వాస్తవం కాదా అని కిరణ్ను ప్రశ్నించారు. పదవిని కాపాడుకోవడం కోసం సీమాంధ్ర ప్రజలకు కిరణ్ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
సమ్మె చేస్తున్న ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికుల జీవితాల గురించి ముఖ్యమంత్రి కిరణ్ పట్టించుకోవడం లేదని అన్నారు. తన ప్రశ్నలపై ప్రజలకు సమాధానం చెప్పాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రజల కోసం ఒక్క సంక్షేమ పతకాన్ని అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులకు సీఎం కిరణే కారణమని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశాల పేరుతో కాలం గడుపుతున్నారని, ప్రజల సమస్యలపై స్పందించడం లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేసుల నుంచి తప్పించుకోవడానికే కాంగ్రెస్తో కుమ్మక్కయ్యారని అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో తన వాదన స్పష్టం చేయకుండానే చంద్రబాబు బస్సు యాత్రలు చేయడం సరికాదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications