నాయకుడిని మెప్పించి పదవీ తెచ్చుకోవాలే.. నొప్పించి కాదు.. మంత్రి అంబటి రాంబాబు
ఏపీలో మంత్రివర్గం ఏర్పాటుతో అసంతృప్త జ్వాల నెలకొన్న సంగతి తెలిసిందే. పదవీ రానీ వారు బాధపడిన ఘటనలు చూశాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. తదితరులు మంత్రి పదవీని ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ వారికి పదవీ వరించలేదు. దీంతో అనుచరులు రాజీనామాలు.. అంటూ హడావిడి చేశారు. దీనిని సీరియస్గా తీసుకున్న సీఎం జగన్.. వారిని పిలిపించి మరీ మాట్లాడారు. ఇప్పటికీ సుచరిత తప్ప..మిగతా వారంతా సద్దుమణిగారు. అయితే దీనిపై వ్యవసాయశాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.
మంత్రి పదవీ కోల్పోయిన వారికి, ఆశించి రాని వారికి అసంతృప్తి ఉంటుందని అంబటి రాంబాబు కామెంట్ చేశారు. అసంతృప్తి వ్యక్తం చేయడంలో తప్పు చేస్తే మాత్రం ఎవరు క్షమించరని అన్నారు. వచ్చే ఐదేళ్లు ముఖ్యమంత్రిగా జగనే ఉంటారని రాంబాబు జోస్యం చెప్పారు. ఇప్పుడు రానివారికి భవిష్యత్లో సీఎం జగన్ మంత్రి పదవులు ఇస్తారని చెప్పారు. సో వెయిట్ చేయక తప్పదని హింట్ చేశారు. కానీ కొందరు.. అనుచరులు మితీమిరుతున్నారని కామెంట్ చేశారు.
అంతేకాదు నాయకుడిని మెప్పించి పదవులు తెచ్చుకోవాలని సజెస్ట్ చేశారు. నాయకుడిని నొప్పించి పదవులు తెచ్చుకోలేరని అంబటి రాంబాబు చెప్పారు. ఈ సూత్రాన్ని అసంతృప్తులు గమనించాలని పదే పదే చెప్పారు. తమ పార్టీ నాయకుల్లో ఉన్న అసంతృప్తి టీకప్పులో తుపాను అని చెప్పారు. ఇవాళ కడపలో పర్యటించారు.
రాష్ట్రానికి మణిహారం లాంటి పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. పోలవరంతో పాటు రాయలసీమలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని అంబటి రాంబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి గారి కల అని.. దానిని త్వరగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తామని వివరించారు. దానికి సంబంధించి యుద్ద ప్రాతిపదికన పనులు చేపడుతామని తెలిపారు.