బ్యాలెట్ పత్రాలతోనే ఎన్నికలు : ఇదెక్కడి ప్రజాస్వామ్యం : ఏమార్చేస్తారు..
టిడిపి అధినేత..ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవియం లను రద్దు చేయాలని డిమాండ్ చేసారు. ఇవియంల స్థానం లో బ్యాలెట్ కు వెళ్లాలని డిమాండ్ చేసారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్ పత్రాలతోనే నిర్వహిస్తామని స్పష్టంచేశారు. ఈవీఎం చిప్ ఆధారిత మిషన్ అని, దాన్ని సులభంగా ఏమార్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని పై అన్ని పార్టీలతో కలిసి పోరాడతామని ప్రకటించారు.
'చంద్రబాబూ! ఇదేం తీరు, తుఫాను వచ్చినప్పుడు పక్క రాష్ట్రాల్లో, రేపు వచ్చి హడావుడి'
బ్యాలెట్ కోసం పోరాటం చేస్తాం..
ఈ విషయమై అన్ని పార్టీలతో కలిసి పోరాడతామని చెప్పారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఈవీఎంలను వ్యతిరేకిస్తున్నానని, బ్యాలెట్ పత్రాలతోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నానని చంద్రబాబు గుర్తుచేశారు. అన్ని రాష్ట్రాల్లోనూ సమస్యలు ఉన్నాయన్నారు. గతంలో తాము పోరాడితేనే వీవీ ప్యాట్లు వచ్చాయని చెప్పారు. అవీ సరైన కాంతి లేకుండా చూసుకోవాలని, దాని వల్ల సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
ఈవీఎంలను తయారుచేసినవారు ఆ చిప్కు కమాండ్ ఇచ్చి మోసం చేసే ఆస్కారం ఉందన్నారు. రెండు మూడు నెలల్లోనే ఈవీఎంలో రికార్డు అంతా పోతుందని, మళ్లీ లెక్కించడానికి సైతం ఆస్కారం ఉండదన్నారు. అమెరికాలో కూడా బ్యాలెట్తోనే ఎన్నికలకు వెళుతున్నారని, ప్రపంచమంతా ఈవీఎంలకు వ్యతిరేకంగానే ఉందని చంద్రబాబు చెప్పారు. సింగపూర్ ప్రధాని కూడా తాము యంత్రాలపై ఆధారపడబోమని చెప్పారన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్ పత్రాలతోనే నిర్వహిస్తామని స్పష్టంచేశారు. సార్వత్రిక ఎన్నికలు బ్యాలెట్ పత్రాలతోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ లో ప్రశ్నార్ధకం..పోరాడితేనే వీవీ ప్యాట్ లు..
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవియం ల పై వస్తున్న విమర్శలను ప్రస్తావించారు. తాజాగా తెలంగాణ ఎన్నికల్లోనూ ఇవియం ల విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా మారిందని ఆరోపించారు. అన్ని రాష్ట్రాల్లోనూ సమస్యలు ఉన్నాయన్నారు. గతంలో తాము పోరాడితేనే వీవీ ప్యాట్లు వచ్చాయని చెప్పారు. అవీ సరైన కాంతి లేకుండా చూసుకోవాలని, దాని వల్ల సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఈవీఎంలను తయారుచేసినవారు ఆ చిప్కు కమాండ్ ఇచ్చి మోసం చేసే ఆస్కారం ఉందన్నారు. రెండు మూడు నెలల్లోనే ఈవీఎంలో రికార్డు అంతా పోతుందని, మళ్లీ లెక్కించడానికి సైతం ఆస్కారం ఉండదన్నారు. అమెరికాలో కూడా బ్యాలెట్తోనే ఎన్నికలకు వెళుతున్నారని, ప్రపంచమంతా ఈవీ ఎంలకు వ్యతిరేకంగానే ఉందని చంద్రబాబు చెప్పారు. సింగపూర్ ప్రధాని కూడా తాము యంత్రాలపై ఆధారపడబోమ ని చెప్పారన్నారు. మరి..మన దగ్గర మాత్రం ఇవియం లు ఎందుకని ప్రశ్నించారు. త్వరలోనే దీని పై అన్ని పార్టీలతో కలిసి పోరాడుతామని ప్రకటించారు.