పంచాయతీ సిత్రం..: బరిలో స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి వాణి..
ఏపీ పంచాయతీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగబోతోంది. బరిలో ప్రముఖుల సతీమణీలు/ బంధువులు నిలిచారు. ఆ ఎన్నికను వారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తొలుత ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వీలుకాక పోవడంతో గెలిచేందుకు శక్తి మేర ట్రై చేస్తున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారం సతీమణి వాణి కూడా సర్పంచ్ బరిలో ఉన్నారు. స్వగ్రామంలో ఆమె పంచాయతీ ప్రథమ పౌరురాలి రేసులో నిలిచారు.
Recommended Video
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి వాణి సర్పంచ్గా నామినేషన్ దాఖలు చేశారు. ఆముదాలవలస మండలం తొగరాం పంచాయతీ సర్పంచ్ అభ్యర్ధిగా వాణి నామినేషన్ దాఖలు చేశారు. తొగరాం సర్పంచ్ ఎన్నికను స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. టీడీపీ బలపరిచిన అభ్యర్థి తమ్మినేని భారతమ్మ నామినేషన్ దాఖలు చేశారు. ఏకగ్రీవం కోసం తమ్మినేని సీతారాం చేసిన ప్రయత్నం విఫలమైంది. దీంతో ఎన్నిక అనివార్యమైంది.
ఏపీలో పంచాయతీ పోరు మూడు విడతల్లో జరగనున్న సంగతి తెలిసిందే. బరిలో ప్రముఖులు నిలిచారు. పంచాయతీ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ హింట్ ఇచ్చారు. ఎన్నికల కోడ్ కంటిన్యూ అవుతుందని స్పష్టత ఇచ్చారు. కానీ అధికార ప్రకటన మాత్రం వెలువడలేదు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీ మార్చి 31వ తేదీతో ముగియనుంది. ఆ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటున్నారు. కానీ అధికార వైసీపీ మాత్రం అందుకు సముఖుంగా లేదు. పంచాయతీకి అయిష్టంగానే బరిలోకి దింపింది. మరీ జడ్పీ ఎన్నికలు ఎలా జరుగుతాయో చూడాలి మరీ.