ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: సింగనమల నియోజకవర్గం గురించి తెలుసుకోండి
Recommended Video
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ సెగ్మెంట్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఎల్లనూరు, పుట్లూ రు, బి.కె సముద్రం మండలాలు ఈ నియోజకవర్గంలో చేరాయి. తొలుత 1955,1962 లో పుట్లూరు నియోజకవర్గంగా ఉన్న ఈ సెగ్మెంట్ లో ఒకసారి కాంగ్రెస్..ఒక సారి సిపిఐ గెలిచాయి. సిపిఐ నుండి ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు తరిమెల నాగిరెడ్డి గెలిచారు. ఆయన అనంతపురం నుండి రెండు సార్లు గెలిచారు. సొంత బావ నీలం సంజీవరెడ్డిని ఓడించారు. 1969 లో శాసనసభకు రాజీనామా చేసి విప్లవ ఉద్యమం వైపు వెళ్లారు. సింగనమల నియోజకవర్గంలో కె జయరాం ఇక్కడి నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా పని చేసారు. ఇక్కడ ఒకసారి గెలిచిన రుక్మిణి దేవి గతంలో హిందూపూర్, మడకశిర నియోజకవర్గాల నుండి గెలిచారు.
11
సార్లు
ఎన్నికలు..
సింగనమల
నియోజకవర్గానికి
ఇప్పటి
వరకు
11
సార్లు
ఎన్నికలు
జరిగాయి.
ఆ
ఎన్నికల్లో
కాంగ్రెస్
నాలుగు
సార్లు,
టిడిపి
అయిదు
సార్లు,
జనతాపార్టీ
ఒకసారి,
స్వతంత్ర
అభ్యర్ది
ఒకసారి
గెలిచారు.
2004,
2009
ఎన్నికల్లో
శైలజానాద్
కాంగ్రెస్
అభ్య
ర్దిగా
పోటీ
చేసి
రెండు
సార్లు
గెలిచారు.
ఆ
రెండు
సార్లు
టిడిపి
మహిళా
నేత
శమంతకమణి
మీద
గెలుపొందారు.
శమంతక
మణి
గతంలో
కాంగ్రెస్
నుండి
గెలిచారు.
ఆ
తరువాత
టిడిపి
లో
చేరారు.
ప్రస్తుతం
టిడిపి
ఎమ్మెల్సీ
గా
ఉన్నారు.
ఆమె
కుమార్తె
యామినీ
బాల
ఇక్కడి
నుండి
ఎమ్మెల్యేగా
గెలుపొందారు.
2014
ఎన్నికల్లో
టిడిపి
గెలుపు..
204
ఎన్నికల్లో
సింగనమల
నియోజకవర్గంలో
మొత్తం
211289
ఓట్లు
ఉండగా,
అందులో
176418
ఓట్లు
పోలయ్యాయి.
కాగా,
టిడిపి
నుండి
పోటీ
చేసిన
యామినీ
బాల
కు
86679
ఓట్లు
రాగా,
వైసిపి
అభ్యర్ది
పద్మావతి
కి
82095
ఓట్లు
వచ్చాయి.
టిడిపి
అభ్యర్ది
యామినీ
బాల
4584
ఓట్ల
మెజార్టీతో
గెలుపొందారు.
ఆ
తరువాత
యామినీ
బాల
శాసనసభలో
విప్
గా
ఉన్నారు.
గతంలో
ఇక్కడ
నుండి
రెండు
సార్లు
గెలిచిన
శైలజా
నాద్
కాంగ్రెస్
ప్రభుత్వంలో
చీఫ్
విప్
గా
,
కిరణ్
కుమార్
రెడ్డి
క్యాబినెట్
లో
మంత్రిగా
పని
చేసారు.