గర్భిణీ అని కూడా చూడలేదు.. రైలు నుంచి తోసేశారు.. కొండవీడు ఎక్స్ప్రెస్ లో దొంగల బీభత్సం
అనంతపురం : కొండవీడు రైలులో దొంగలు రెచ్చిపోయారు. గర్భిణీ అని చూడకుండా ప్రయాణీకురాలిని రైలు నుంచి కిందకు తోసేశారు. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ధర్మవరం రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే..
బాత్రూమ్ కు వెళ్లి వస్తున్న దివ్య అనే ప్రయాణీకురాల్ని నిలువరించిన దొంగలు దారికి అడ్డంగా నిలబడ్డారు. ఆమె మెడలోంచి బంగారు గొలుసు తెంపే ప్రయత్నం విఫలం కావడంతో.. రైలు నుంచి కిందకు నెట్టివేశారు. తర్వాత వారు కూడా రైల్లోంచి దూకి ఆమె మెడలోని బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు.

దొంగల బీభత్సంతో దివ్య అపస్మారక స్థితికి చేరుకుంది. అయితే ఘటన జరిగిన ప్రాంతానికి చేరువలో ఉన్నవారు ఆమెను గమనించి 108 సిబ్బందికి సమాచారమివ్వడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గర్భిణీ కావడంతో తీవ్ర రక్తస్రావం అయినట్లు తెలుస్తోంది. ఆమె పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ప్రైవేట్ ఆసుపత్రికి పంపించారు.
గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన దివ్య.. తన భర్త ఉద్యోగరీత్యా బెంగుళూరులో ఉండటంతో అక్కడకు వెళ్లడానికి అత్తతో కలిసి కొండవీడు ఎక్స్ ప్రెస్ లో బయలుదేరారు. మార్గమధ్యంలో ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications