ఏమీ నిర్లక్ష్యం.. 13 గంటల బెడ్పై రోగి మృతదేహం, కలెక్టర్ ఆగ్రహాంతో సిబ్బందిలో కదలిక..
వైద్యో నారాయణో హరి అని ఊరికే అనలేదు. వైద్యులను దేవుడితో పోలుస్తారు. కానీ కొన్నిచోట్ల ఆడపా దడపా నిర్లక్ష్య ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం వెలుగుచూసింది. ఓ రోగి చనిపోయినా.. ఆమెను పట్టించుకునే నాథుడే లేడు. అలా మృతదేహాం గంట కాదు రెండు గంటలు కాదు 13 గంటలు అలానే బెడ్ మీదే ఉంది. ఈ ఘటన స్థానికలంగా కలకలం రేపింది.
ప్రభుత్వ ఆస్పత్రి కోవిడ్-వార్డులో వైద్య సిబ్బంది తక్కువ మంది ఉన్నారు. కరోనా వైరస్ రోగులను పట్టించుకునే వారు లేదు. దీంతో ఆస్పత్రిలో ఓ మహిళ చనిపోయారు. కానీ సిబ్బంది మాత్రం పట్టించుకోలేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దవాఖానలో రోగి చనిపోతే పట్టదా అని ప్రశ్నిస్తున్నారు. మార్చురీకి తరలించానలి.. తర్వాత కుటుంబసభ్యులకు అప్పగించాల్సిన సంగతి మరచిపోయారా అని మండిపడుతున్నారు. విధుల్లో అలసత్వంపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.

మరోవైపు దవాఖానలో పరిస్థితిని ట్రైనీ కలెక్టర్ సూర్య సమీక్షించారు. మహిళ మృతదేహం ఉండటంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరుపై మండిపడ్డకా కానీ.. సిబ్బంది కళ్లు తెరవలేదు. ఆ తర్వాత మహిళ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. బంధువులకు అప్పగించి చేతులు దులుపుకున్నారు. మరోసారి ఇలాంటి ఘటన జరిగితే ఉపేక్షించబోము అని సూర్య హెచ్చరించినట్టు తెలుస్తోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications