ఏపీలో స్థిరంగా కొత్త కరోనా కేసులు, పెరిగిన మరణాలు, రికవరీ: జిల్లాల వారీగా కేసులివే
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నమోదవువుతున్న కరోనావైరస్ కేసులు స్థిరంగా ఉంటున్నాయి. తాజాగా 3వేలకు దిగవనే కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే, కరోనా టెస్టుల సంఖ్య కూడా స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 93,785 నమూనాలను పరీక్షించగా.. 2526 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది.
తెలంగాణలో పెరిగిన కరోనా కొత్త కేసులు: తగ్గిన రికవరీ, జిల్లాలవారీగా కేసులివే
ఏపీలో కొత్తగా 2526 కరోనా కేసులు, 26 మంది మృతి
తాజాగా
నమోదైన
2526
కరోనా
కేసులతో
రాష్ట్రంలో
మొత్తం
కరోనా
కేసుల
సంఖ్య
19,32,105కి
చేరింది.
గత
24
గంటల్లో
కరోనా
బారినపడి
24
మంది
మృతి
చెందారు.
అత్యధికంగా
ప్రకాశం
జిల్లాలో
ఆరుగురు
మరణించగా,
కృష్ణాలో
ఐదుగురు,
చిత్తూరులో
నలుగురు,
గుంటూరు,
నెల్లూరు,
పశ్చిమగోదావరి
జిల్లాల్లో
ఇద్దరు
చొప్పున,
అనంతపురం,
తూర్పుగోదావరి,
విశాఖపట్నం
జిల్లాల్లో
ఒక్కొక్కరు
చొప్పున
మరణించారు.
దీంతో
ఇప్పటి
వరకు
నమోదైన
మొత్తం
మరణాల
సంఖ్య
13,081
మృతి
చెందారు.
ఏపీలో పెరుగుతున్న రికవరీ.. 25వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు
ఒక్క
రోజు
వ్యవధిలో
రాష్ట్రంలో
2,933
మంది
పూర్తిగా
కోలుకోగా,
ఇప్పటి
వరకు
రాష్ట్రంలో
ఆ
మహమ్మారి
నుంచి
సురక్షితంగా
బయటపడినవారి
సంఖ్య
18,93,498కి
చేరింది.
కాగా,
రాష్ట్రంలో
కొత్త
నమోదైన
కేసుల
కంటే
కరోనా
నుంచి
కోలుకున్నవారి
సంఖ్య
ఎక్కువగా
ఉంటోంది.
దీంతో
రాష్ట్రంలో
యాక్టివ్
కేసుల
సంఖ్య
క్రమంగా
తగ్గుతోంది.
ప్రస్తుతం
25,526
యాక్టివ్
కేసులున్నాయి.
ఇప్పటి
వరకు
రాష్ట్రంలో
2,33,14,697
కరోనా
నమూనాలను
పరీక్షించారు.
గడిచిన
24
గంటల్లో
అత్యధికంగా
తూర్పుగోదావరి
జిల్లాలో
404
పాజిటివ్
కేసులు
నమోదు
కాగా,
అల్పంగా
కర్నూలులో
35
మంది
కరోనా
బారినపడ్డారు.
ఏపీలో జిల్లాల వారీగా కరోనావైరస్ కొత్త కేసులివే
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 80, చిత్తూరులో 391, తూర్పుగోదావరిలో 404, గుంటూరులో 178, కడపలో 157, కృష్ణాలో 269, కర్నూలులో 35, నెల్లూరులో 210, ప్రకాశంలో 308, శ్రీకాకుళంలో 91, విశాఖపట్నంలో 119, విజయనగరంలో 49, పశ్చిమగోదావరిలో 235 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,71,553, చిత్తూరులో 2,25,882 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. కాగా, ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(81,002) కరోనా కేసులున్నాయి.