వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో స్థిరంగా కొత్త కరోనా కేసులు, పెరిగిన మరణాలు, రికవరీ: జిల్లాల వారీగా కేసులివే

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నమోదవువుతున్న కరోనావైరస్ కేసులు స్థిరంగా ఉంటున్నాయి. తాజాగా 3వేలకు దిగవనే కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే, కరోనా టెస్టుల సంఖ్య కూడా స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 93,785 నమూనాలను పరీక్షించగా.. 2526 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది.

తెలంగాణలో పెరిగిన కరోనా కొత్త కేసులు: తగ్గిన రికవరీ, జిల్లాలవారీగా కేసులివేతెలంగాణలో పెరిగిన కరోనా కొత్త కేసులు: తగ్గిన రికవరీ, జిల్లాలవారీగా కేసులివే

ఏపీలో కొత్తగా 2526 కరోనా కేసులు, 26 మంది మృతి

ఏపీలో కొత్తగా 2526 కరోనా కేసులు, 26 మంది మృతి

తాజాగా నమోదైన 2526 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,32,105కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 24 మంది మృతి చెందారు.
అత్యధికంగా ప్రకాశం జిల్లాలో ఆరుగురు మరణించగా, కృష్ణాలో ఐదుగురు, చిత్తూరులో నలుగురు, గుంటూరు, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున, అనంతపురం, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 13,081 మృతి చెందారు.

ఏపీలో పెరుగుతున్న రికవరీ.. 25వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు

ఏపీలో పెరుగుతున్న రికవరీ.. 25వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు


ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 2,933 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 18,93,498కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం 25,526 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,33,14,697 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 404 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా కర్నూలులో 35 మంది కరోనా బారినపడ్డారు.

ఏపీలో జిల్లాల వారీగా కరోనావైరస్ కొత్త కేసులివే

ఏపీలో జిల్లాల వారీగా కరోనావైరస్ కొత్త కేసులివే

ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 80, చిత్తూరులో 391, తూర్పుగోదావరిలో 404, గుంటూరులో 178, కడపలో 157, కృష్ణాలో 269, కర్నూలులో 35, నెల్లూరులో 210, ప్రకాశంలో 308, శ్రీకాకుళంలో 91, విశాఖపట్నంలో 119, విజయనగరంలో 49, పశ్చిమగోదావరిలో 235 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,71,553, చిత్తూరులో 2,25,882 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. కాగా, ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(81,002) కరోనా కేసులున్నాయి.

English summary
2,526 new corona cases reported in andhra pradesh: 24 deaths in last 24 hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X